Moviesఇంట్రెస్టింగ్: మహేశ్-రాజమౌళి కాంబో సెట్ చేసింది ఎవరో తెలుసా..?

ఇంట్రెస్టింగ్: మహేశ్-రాజమౌళి కాంబో సెట్ చేసింది ఎవరో తెలుసా..?

మహేష్ వరుసగా సినిమాల్ని లైన్‌లో పెడుతూ.. జెట్ స్పీడ్ లా దూసుకుపోతున్నారు. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ అబ్స్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో..ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తరువాత రాజమౌళి తో మరో బిగ్గెస్ట్ సినిమాకి ప్లాన్ చేశారు. నిజానికి జక్కన్న , మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటూ గత పదేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ కాంబినేషన్ కుదిరింది.


అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాదిలోనే వీరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని తెలిసింది. త్రివికర్మ్ తో సినిమాను ఆరు నెలలు లో కంప్లీట్ చేసి..రాజమౌళి సినిమా మొదలుపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాకి సంబంధించిన ఏ వార్త అయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

గతంలో సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణకు జక్కన్న ఓ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. ఆ హామీ మేరకు వచ్చే ఏడాదిలో ఆయనతో సినిమా చేస్తానని జక్కన్న మరోసారి కలిసి మాటిచ్చాడట. ఈ సినిమా మహేష్‌తో చేయాలని నారాయణ కోరిక. ఇందుకు మహేష్ కూడా సుముఖంగానే వున్నాడు. ఈ రకంగా జక్కన్న-మహేష్ కాంబో కుదరనుందని సినీవర్గాల పక్కా సమాచారం. మొత్తానికి.. ఎప్పటినుంచో సినీజనాలు కోరుకుంటున్న వీరి కాంబో వచ్చే ఏడాదిలో కలవనుందన్నమాట. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వరయ రాయ్ ని ఫిక్స్ చేసిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news