Moviesవావ్: ఎన్టీఆర్, మహేష్ ఇద్దరికి రాజమౌళి గుర్తుండిపోయే గిఫ్ట్..భలేగా ఉందే..!!

వావ్: ఎన్టీఆర్, మహేష్ ఇద్దరికి రాజమౌళి గుర్తుండిపోయే గిఫ్ట్..భలేగా ఉందే..!!

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. అపజయం ఎరుగని డైరెక్టర్ గా..ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతేనా మన తెలుగు సినిమా గొప్పతనాని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునేలా బాహుబలి సినిమాతో చాటి చెప్పాడు. ఇక అలాగే రీసెంట్ RRR తో తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు జక్కన్న. అలాంటి జక్కన్న అనుకోని విధంగా..ఇద్దరు స్టార్ హీరోల కెరీర్ లో గుర్తుండిపోయేలా చేయబోతున్నాడు.

మనకు తెలిసిందే తారక్ , రాజమౌళి ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది. వీళ్ల కాంబోకి సూపర్ క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు వచిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గానే నిలిచాయి. కాగా, రీసెంట్ గా వచ్చిన RRR కూడా మంచి విజయం సాధించింది. తారక్ కెరీర్ లో 29వ సినిమా గా తెరకెక్కిన RRR ను రాజమౌళి డైరెక్ట్ చేశాడు.

కాగా, సేమ్ టూ సేమ్ అచ్చం అలాగే మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రాబోతున్న మూవీ ని డైరెక్ట్ చేసేది రాజమౌళినే. ప్రజెంట్ SSMB 28 ను తివిక్రమ్ శ్రీనీవాస్ తో సినిమా చేస్తున్న మహేశ్..ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లోనే..సినిమా తీయ్యబోతున్నాడు. అనుకోని విధంగా ఇద్దరు స్టార్ హీరోలకి తమ కెరీర్ లో 29 వ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తూ..వాళ్ల కెరీర్ లోనే మర్చిపోలేని విజాయాలని అందించనున్నాడు. ఇంతకన్న గొప్ప గిఫ్ట్ ఏముంటుంది..చెప్పండి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news