Moviesమ‌ధ్య‌లోనే ఆగిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు.. బాబోయ్ లిస్ట్ పెద్ద‌దే...!

మ‌ధ్య‌లోనే ఆగిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు.. బాబోయ్ లిస్ట్ పెద్ద‌దే…!

మ‌న స్టార్ హీరోల సినిమాలు భారీ అంచ‌నాల‌తో ప్రారంభ‌మై మ‌ధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. చిన్న హీరోల సినిమాల సంగ‌తి కాసేపు ప‌క్క‌న పెడితే పెద్ద హీరోల సినిమాలు కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యి.. సాంగ్స్‌తో పాటు కొంత పార్ట్ షూట్ అయ్యాక ఆగిపోతూ ఉంటాయి. ఇలా మ‌ధ్య‌లోనే ఆగిపోయిన స్టార్ హీరోల సినిమాలు చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వినాల‌ని ఉంది సినిమా అనౌన్స్ చేశారు. అప్ప‌ట్లో వ‌ర్మ స్టార్ డైరెక్ట‌ర్‌. వ‌ర్మ – చిరు కాంబినేష‌న్ అన‌గానే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఊర్మిళ‌, ట‌బు హీరోయిన్లు. కార‌ణం తెలియ‌దు కాని.. వ‌ర్మ తీరు న‌చ్చ‌క చిరుయే వ‌దిలేశాడ‌ని అంటారు. ఇక చిరంజీవి హీరోగా సురేష్‌కృష్ణ ద‌ర్శ‌కత్వంలో అబు సినిమా ప్లాన్ చేశారు. ఏఆర్‌. రెహ్మ‌న్‌ను మ్యూజిక్‌కు పెట్టి.. హాలీవుడ్ టెక్నీషియ‌న్ల‌కు ఈ సినిమాకు తీసుకువ‌చ్చారు.

ఇది అప్ప‌ట్లోనే పాన్ ఇండియా లెవ‌ల్లో రు. 50 కోట్ల‌తో ప్లాన్ చేశారు. చిరు గెట‌ప్ కోసం చాలా స్కెచ్‌లు గీశారు. అయితే కొంద‌రు ముస్లిం నేత‌ల ఒత్తిళ్ల కార‌ణంగానే ఈ సినిమా ఆగిపోయింద‌ని అంటారు. ఇక బాల‌య్య హీరోగా కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ‌సింహా భూప‌తి అనుకున్నారు. ఎస్‌. గోపాల్ రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా ప్లాన్ చేశారు. స‌గం షూటింగ్ కూడా పూర్త‌య్యింది. అయితే బాల‌య్య‌కు ఏదో న‌చ్చ‌క సినిమా మ‌ధ్య‌లోనే వ‌దిలేశార‌ని అంటారు.

ఎన్టీఆర్ న‌టించిన అద్భుత‌మైన సినిమా న‌ర్త‌న‌శాల. 1963లో వ‌చ్చింది. త‌ర్వాత ఈ క‌థ ఈ జ‌న‌రేష‌న్‌కు తెలియాల‌నే బాల‌య్య స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మైంది. అయితే ఈ సినిమాలో ద్రౌప‌ది పాత్ర‌ధారి సౌంద‌ర్య ప్ర‌మాదంలో మృతి చెందడంతో ఈ ప్రాజెక్టు మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. వెంక‌టేష్ హోం మంత్రిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో అనుకున్న రాధా కూడా మ‌ధ్య‌లో ఆగిపోయింది. డీవీవీ దాన‌య్య నిర్మించాల్సిన ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌. అయితే అదే టైటిల్‌తో త‌ర్వాత శ‌ర్వానంద్ హీరోగా సినిమా తీశారు.

వెంక‌టేష్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఆటా నాదే… వేట నాదే అనుకున్నా మ‌ధ్య‌లో ఆగిపోయింది. నాగార్జున – మ‌హేష్‌బాబు మ‌ణిర‌త్నం కాంబినేష‌న్లో రావాల్సిన సినిమా కూడా స్క్రిఫ్ట్ ద‌శ‌లో ఆగిపోయింది.
నాగార్జున – ధ‌నుష్‌ల కాంబోలో ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో నాన్ రుద్ర‌న్ అనే మ‌ల్టీస్టార‌ర్ రావాల్సి ఉంది. షూటింగ్ మొద‌లై ఓ షెడ్యూల్ అయినా కూడా మ‌ధ్య‌లో ఆపేశారు.

ప‌వర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి 2003లో ఈ సినిమాను అనౌన్స్ అయ్యింది. దాసరి క్లాప్ కొట్ట‌గా.. విక్ట‌రీ వెంక‌టేష్ కెమేరా స్విచ్ ఆన్ చేశారు. వినాయ‌క్ ఫ‌స్ట్ షాట్ డైరెక్ట్ చేశారు. ఆ త‌ర్వాత ఆ సినిమా మ‌ధ్య‌లో ఆగిపోయింది. సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌కత్వంలో ప‌వ‌న్ హీరోగా జీసస్ క్రైస్ట్ సినిమా అనుకున్నారు. షూటింగ్ కోసం ఇజ్రాయెల్ వెళ్లారు. ఇది కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. మ‌గ‌ధీర త‌ర్వాత కాజ‌ల్ – రాంచ‌ర‌ణ్ మెరుపు సినిమా కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఇలా చాలా స్టార్ హీరోల సినిమాలు మ‌ధ్య‌లోనే బ్రేక్ ప‌డ్డాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news