Moviesప‌వ‌న్ క‌ళ్యాణ్ - రాజ‌మౌళి కాంబినేష‌న్లో మిస్ అయిన సినిమా ఏదో...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రాజ‌మౌళి కాంబినేష‌న్లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా…!

టాలీవుడ్ రాజమౌళి ఇప్పుడు నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు. రాజమౌళితో సినిమా చేసేందుకు కేవలం తెలుగు సినిమా హీరోలు మాత్రమే కాదు… దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో స్టార్ హీరోలుగా ఉన్న వారు సైతం ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అయితే రాజమౌళితో ఒక్క పాన్‌ ఇండియా సినిమా పడితే చాలు అన్న కోరికలతో ఉన్నారు. అయితే రాజమౌళి మూడేళ్లకు ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నాడు. తాజాగా రాజమౌళి డైరెక్ట్ చేసిన త్రిబుల్ ఆర్‌ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు 12 వందల కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది

ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా రెండు సంవత్సరాలకు పైగానే జరుగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత రాజమౌళి క్రేజ్‌ ఇండియా వైజ్‌గా మామూలుగా లేదు. ఇక రాజమౌళి ఎక్కడికి వెళ్ళినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మీ సినిమా ఎప్పుడు ?ఉంటుంది అన్న ప్రశ్నలు ఆయనకు ఎదురవుతూనే ఉంటాయి.

తాను గతంలోనే పవన్ కళ్యాణ్‌కు ఓ స్టోరీ చెప్పానని.. ఆయన నుంచి తనకు ఎలాంటి రిప్లై రాలేదని అలా పవన్ కళ్యాణ్ తన కాంబినేషన్లో సినిమా ఆగిపోయిందని రాజమౌళి చెప్పారు. ఆ తర్వాత ఎవరి కెరీర్ పరంగా వారు బిజీ అయిపోయారు. రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా సై సినిమా వచ్చింది. అప్పట్లో రగ్బీ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించినా.. ఓవరాల్‌గా రాజమౌళి అప్పటి సినిమాలతో పోలిస్తే కాస్త తక్కువ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది.

 

ఈ సినిమాను రాజమౌళి ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తీయాలని అనుకున్నారట. డిఫరెంట్ కథ‌ కావడంతో స్టోరీ విన్నాక పవన్ నో చెప్పేశాడట. ఇందుకు కారణం అప్ప‌ట‌కీ మన తెలుగు ప్రేక్షకులకు ర‌గ్బీ గురించి పెద్దగా తెలియదని… ఈ కథతో సినిమా చేస్తే ప్రేక్షకులు పెద్దగా కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ భావించడమే ఇందుకు కారణం. అయితే రాజమౌళి తర్వాత ఇదే కథను కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీకి… బలమైన విలనిజం పెట్టి నితిన్ – జెనీలియా హీరోహీరోయిన్లుగా సై సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా నితిన్ కెరీర్లో మంచి విజయం సాధించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news