Moviesఈ 6 గురు స్టార్ హీరోయిన్ల‌తో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌కు ఉన్న లింక్...

ఈ 6 గురు స్టార్ హీరోయిన్ల‌తో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌కు ఉన్న లింక్ ఇదే…!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు తాజాగా స‌ర్కారు వారి పాట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా త‌ర్వాత రెండున్న‌రేళ్లు గ్యాప్ తీసుకుని మ‌హేష్ స‌ర్కారు వారి పాట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా సూప‌ర్ వ‌సూళ్ల‌తో ముందుకు వెళుతోంది. గ‌త కొంత కాలంగా చూస్తే మ‌హేష్ త‌న ప్ర‌తి సినిమాకు హీరోయిన్‌ను మారుస్తూ వ‌స్తున్నాడు. మ‌హేష్ హీరోయిన్ల‌ను రిపీట్ చేయ‌డం అరుదుగా ఉంటుంది.

సీత‌మ్మ వాకిట్లో సినిమాలో సమంత‌ను రిపీట్ చేశాక ఆ త‌ర్వాత త‌మ‌న్నా, క్రితీ స‌న‌న్‌, శృతీహాస‌న్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌తో వ‌రుస‌గా సినిమాలు చేశాడు. బ్ర‌హ్మోత్స‌వంలో మాత్రం కాజ‌ల్‌, స‌మంత‌ను మ‌ళ్లీ రిపీట్ చేశాడు. ఆ త‌ర్వాత కియారా అద్వానీ, పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న‌.. తాజా సినిమాలో కీర్తి సురేష్‌తో రొమాన్స్ చేశాడు. ఇలా గ‌త ప‌దేళ్ల‌లో మ‌హేష్ రిపీట్ చేసిన హీరోయిన్లు కేవ‌లం స‌మంత‌, కాజ‌ల్ మాత్ర‌మే.

అయితే మ‌హేష్‌తోనే తొలిసారిగా కెరీర్ స్టార్ట్ చేయ‌డం.. లేదా తెలుగులో మ‌హేష్‌తోనే కెరీర్ మొద‌లు పెట్టిన కొంద‌రు హీరోయిన్ల కెరీర్ మాత్రం పూర్తిగా రివ‌ర్స్ అయ్యింది. వాళ్లు తొలిసారి మ‌హేష్ ప‌క్క‌న ఛాన్స్ కొట్టేసినా వారికి ఇక్క‌డ కాలం కలిసి రాలేదు. మ‌రి ఆ హీరోయిన్లు ఎవ‌రో చూద్దాం.
1. 2 బిపాసా బసు & లీసారే :
2002లో జ‌యంత్ ద‌ర్శ‌క‌త్వంలో ట‌క్కరిదొంగ సినిమా వ‌చ్చింది. అప్ప‌ట్లో వీరిద్ద‌రు బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు. అయితే సినిమా ప్లాప్ అవ్వ‌డంతో పాటు వీరిని మ‌న వాళ్లు స‌రిగా గుర్తించ‌లేదు. త‌ర్వాత బిపాసా బాలీవుడ్‌లో కొద్ది రోజులు వెలిగినా, లీసారేకు గుర్తింపు రాలేదు. తెలుగులో మ‌ళ్లీ వీళ్ల‌కు ఛాన్సులు రాలేదు.

3. న‌మ్ర‌తా శిరోద్క‌ర్ :
మ‌హేష్‌బాబు వంశీ సినిమాతో మాజీ మిస్ ఇండియాగా ఉన్న న‌మ్ర‌త ఇక్క‌డ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆమె మెగాస్టార్ చిరంజీవి డిజాస్ట‌ర్ సినిమా అంజిలో న‌టించింది. ఆ త‌ర్వాత ఆమెకు తెలుగులో ఛాన్సులు రాలేదు. అయితే మ‌హేష్‌బాబును పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.

4. అమృతారావు :
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అమృతారావు మ‌హేష్‌బాబు హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అతిథి సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమా కూడా ప్లాప్ అవ్వ‌డంతో ఆమెను మ‌నోళ్లు ప‌ట్టించుకోలేదు. త‌ర్వాత బాలీవుడ్‌లోనూ ఆమెకు ఛాన్సులు రాలేదు.

5. కృతిస‌న‌న్ :
మ‌హేష్‌బాబు డిజాస్ట‌ర్ మూవీ వ‌న్ నేనొక్క‌డినే సినిమాతో హీరోయిన్‌గా తెలుగులో హీరోయిన్గా ప‌రిచ‌యం అయ్యింది కృతి. ఆ త‌ర్వాత దోచేయ్ సినిమా చేసిన ప్లాప్‌. తెలుగులో ఆమెకు ఛాన్సులు రాక‌పోయినా హిందీలో మాత్రం దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ప్ర‌భాస్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్‌లో న‌టిస్తోంది.

6. కియారా అద్వానీ :
భ‌ర‌త్ అనే నేను సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అయ్యాక రామ్‌చ‌ర‌ణ్ విన‌య‌విధేయ రామ సినిమా చేస్తే ప్లాప్‌. ఇప్పుడు మ‌రోసారి లాంగ్ గ్యాప్ త‌ర్వాత చెర్రీ – శంక‌ర్ సినిమాలో న‌టిస్తోంది. ఏదేమైనా మ‌హేష్‌తో జోడీ క‌ట్టి తెలుగులో తొలిసారిగా న‌టించిన బాలీవుడ్ భామ‌ల‌కు ఇక్క‌డ పెద్ద‌గా కాలం క‌లిసి రాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news