Moviesత‌న‌తో పెళ్ల‌య్యాక భ‌ర్త మ‌రో ఎఫైర్‌... ఇన్నాళ్ల‌కు సంచ‌ల‌న నిజాలు చెప్పిన...

త‌న‌తో పెళ్ల‌య్యాక భ‌ర్త మ‌రో ఎఫైర్‌… ఇన్నాళ్ల‌కు సంచ‌ల‌న నిజాలు చెప్పిన క్రేజీ హీరోయిన్‌…!

సినిమా రంగంలో ఎంత గొప్ప పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకున్న హీరోయిన్లు అయినా నిజ జీవితంలో ఎన్నో ర‌కాల ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. వారి కెరీర్ పెళ్ల‌య్యాక ఒడిదుడుకుల‌కు లోన‌య్యి చివ‌ర‌కు వారి జీవితంలో అన్ని కోల్పోయిన సంద‌ర్భాలు కూడా ఉంటాయి. మ‌హాన‌టి సావిత్రి వెండితెర‌నే ఎంత ఏలేసినా వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల‌కు లోనైంది.

జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, వాణీశ్రీ, శార‌ద, జ‌యంతి లాంటి గొప్ప న‌టీమ‌ణుల వైవాహిక జీవితాలు చాలా ఇబ్బందుల‌కు గుర‌య్యాయి. బాలీవుడ్ సీనియర్ నటి ముంతాజ్ 70 వ దశకంలో ఎన్నో సినిమాల్లో న‌టించారు. అప్ప‌ట్లో ముంతాజ్ అంటే యూత్ ప్రేక్ష‌కులు కిక్కెక్కిపోయేవారు. అంత అందం ముంతాజ్ సొంతం. 1960లో మొద‌లైన ఆమె కెరీర్ ప్ర‌స్థానం రెండు ద‌శాబ్దాల పాటు తిరుగులేకుండా పోయింది.

సోనికి చిడియా సినిమాతో 11 ఏళ్ల వయసులోనే ఆమె వెండితెర‌పై క‌నిపించింది. బాలీవుడ్ చ‌రిత్ర‌లో రాజేష్‌ఖ‌న్నాకు ఎక్కువ హిట్లు ఇచ్చిన హీరోయిన్‌గా ముంతాజ్‌కు మంచి పేరుంది. 1990లో ఆమె అంధియాన్ సినిమాలో చివ‌రిసారిగా క‌నిపించింది. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌స్సు 70 ఏళ్లు. కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే ఆమె వ్యాపార వేత్త మయూర్ మాధవని వివాహం చేసుకున్నా కూడా సినిమాల‌కు ఫుల్‌స్టాప్ పెట్ట‌లేదు.

ముంతాజ్ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో త‌న భ‌ర్త గురించి సంచ‌ల‌న విష‌యాలు ఇన్నాళ్ల‌కు వెల్ల‌డించారు. త‌న భ‌ర్త‌కు తాను ఎందుకు దూరంగా ఉంటున్నానో కూడా చెప్పారు. పెళ్ల‌య్యాక కూడా త‌న భ‌ర్త వేరే వాళ్ల‌తో ఎఫైర్లు పెట్టుకునే వాడు.. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా నాకు చెప్పేవారు. అలాగ‌ని త‌న‌ను ఎప్పుడూ త‌క్కువ చేసి చూడ‌లేద‌ని… త‌నను చాలా ప్రేమించే వాడ‌ని చెప్పింది. ఎప్ప‌ట‌కీ కూడా నీ చేయి వ‌ద‌ల‌న‌ని చెప్పేవాడ‌ని ముంతాజ్‌చెప్పింది.

అయితే అత‌డి వివాహేత‌ర సంబంధాల‌తో మా మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డ్డాయి. దీంతో తాము వేర్వేరుగా ఉంటున్న‌ట్టు చెప్పింది. మ‌యూర్ వ్యాపారం కోసం అమెరికాలో ఉండిపోగా…. ముంతాజ్ మాత్రం ఇండియాకు తిరిగి వ‌చ్చి ఇక్క‌డే ఉండిపోయింది. ఈ దంప‌తుల‌కు నటాషా..తాన్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ వీళ్లెవ్వరూ సినిమా రంగంలోకి రాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news