Moviesఅక్కినేని కుటుంబానికి ఆ శాపం ఉందా... ఆ విడాకుల‌కు లింక్ ఇదే..?

అక్కినేని కుటుంబానికి ఆ శాపం ఉందా… ఆ విడాకుల‌కు లింక్ ఇదే..?

టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీది ద‌శాబ్దాల చ‌రిత్ర‌. దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వేసిన బ‌ల‌మైన పునాదితో అక్కినేని సినిమా చ‌రిత్ర ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఏఎన్నార్ త‌ర్వాత ఆయ‌న వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆ త‌రంలో స్టార్ హీరోగా, అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా నిలిచాడు. ఇప్పుడు ఆ వంశంలో మూడో త‌రం హీరోలుగా నాగార్జున త‌న‌యుడు అఖిల్‌, చైతు కూడా హీరోలు అయిపోయారు. చైతు ఇప్ప‌టికే తండ్రిలాగా క్లాస్ హీరోగా ఫ్రూవ్ చేసుకోగా.. అఖిల్ న‌వ‌మ‌న్మ‌థుడు అయిపోయాడు.

ఇక ఏఎన్నార్ కుమార్తె త‌న‌యుడు సుమంత్‌తో పాటు సుమంత్ సోద‌రి సుప్రియ కూడా సినిమాల్లోనే కంటిన్యూ అవుతున్నారు. అక్కినేని ఫ్యామిలీకి ఎంత మంచి చ‌రిత్రా ఉన్నా వాళ్ల‌ను వ‌రుస‌గా విడాకులు అనే బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. ఈ కుటుంబానికి విడాకుల శాపం ఉన్న‌ట్టు ఉంద‌ని.. అందుకే ఈ కుటుంబానికి చెందిన వారి వైవాహిక బంధాలు వ‌రుస‌గా విచ్ఛిన్న‌మ‌వుతున్నాయ‌ని.. ఆ కుటుంబానికి ఇదో శాపంగా మారింద‌న్న చ‌ర్చ‌లు, సెంటిమెంట్లు కూడా ఉన్నాయి.

నాగార్జున ముందుగా దివంగ‌త లెజెండ్రీ నిర్మాత రామానాయుడు కుమార్తె శ్రీ ల‌క్ష్మిని పెళ్లాడారు. నాగ‌చైత‌న్య పుట్టిన వెంట‌నే మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో నాగ్ ఆమెకు విడాకులు ఇచ్చేసి హీరోయిన్ అమ‌ల‌ను పెళ్లాడారు. ఈ దంప‌తుల‌కు అఖిల్ పుట్టాడు. పోని నాగార్జున‌కు ముందు వివాహం క‌లిసి రాలేదు అనుకున్నా.. ఆయ‌న ఇద్ద‌రు కుమారుల‌ను కూడా ఆ సెంటిమెంట్ వెంటాడింది.

అస‌లు చైతు – స్టార్ హీరోయిన్ స‌మంత ప్రేమ పెళ్లిని ప్ర‌తి ఒక్కరు ఆశీర్వ‌దించారు. ఆనంద ప‌డ్డారు. అలాంటి వాళ్లు విడిపోతార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. నాలుగేళ్ల‌కే వీరి వైవాహిక బంధం విచ్ఛిన్న‌మైంది. ఇది జాతీయ స్థాయిలో సంచ‌ల‌నం అయ్యంది. ఇక అఖిల్‌కు అపోలో ఫ్యామిలీకి చెందిన శ్రీయా భూపాల్‌తో ప్రేమాయ‌ణం.. ఆ త‌ర్వాత ఎంగేజ్‌మెంట్ అయ్యాక కూడా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది.

పోని నాగార్జున కుమారుల జీవితాలు ఇలా అయ్యాయి అనుకుంటే నాగేశ్వ‌ర‌రావు కుమార్తె కుమారుడు సుమంత్‌, కుమార్తె సుప్రియ జీవితాలు కూడా అలాగే కుదుపున‌కు లోన‌య్యాయి. సుమంత్‌కు ముందుగా అప్పుడు టాప్ యాక్ట‌ర్‌గా ఉన్న హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. యేడాదికే మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వీరు విడిపోయారు.

ఇక సుమంత్ సోద‌రి సుప్రియ సైతం ఇష్టం సినిమాతో హీరో అయిన చ‌ర‌ణ్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ త‌ర్వాత చ‌ర‌ణ్ ప‌లు వ్య‌స‌నాల‌కు లోన‌య్యి ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. అప్ప‌టి నుంచే సుప్రియ‌… చ‌ర‌ణ్ దూరంగా ఉంటూ వ‌చ్చారు. చివ‌ర‌కు చ‌ర‌ణ్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఇలా అక్కినేని ఫ్యామిలీని విడాకులు అనేది ఓ శాపంగా మారి వెంటాడుతోంది. మ‌రి చైతు, అఖిల్ త‌ర్వాత సంబంధాలు అయినా స‌జావుగా సాగుతాయేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news