Moviesఆ థియేట‌ర్లో ' ఆచార్య ' స్పెష‌ల్ షోకు వ‌స్తోన్న ప‌వ‌ర్‌స్టార్‌......

ఆ థియేట‌ర్లో ‘ ఆచార్య ‘ స్పెష‌ల్ షోకు వ‌స్తోన్న ప‌వ‌ర్‌స్టార్‌… రివీల్ చేసిన మెగాస్టార్‌..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య సినిమా రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. చిరు న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి రిలీజ్ అయ్యి మూడున్నర సంవ‌త్స‌రాలు అవుతోంది. ఇంత గ్యాప్ త‌ర్వాత చిరు సినిమా వ‌స్తుండ‌డంతో మెగాభిమానులు మాత్ర‌మే కాకుండా.. సినీ ల‌వ‌ర్స్ అంద‌రూ కూడా ఆచార్య సినిమాను ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూసేయాల‌న్న తాప‌త్ర‌యంతో ఉన్నారు.

ఇటు కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం చిరు, చెర్రీ క‌లిసి న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో పాటు స‌క్సెస్ ఫుల్ సినిమాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా యూనిట్ అంతా ప్ర‌మోష‌న్ల‌లో బిజీ బిజీగా ఉంది. తాజాగా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ చేసిన ప్ర‌మోష‌న్ ఇంట‌ర్వ్యూలోనూ చిరు, చెర్రీ, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ సంద‌డి చేయ‌డంతో పాటు ఎన్నో ఇంట్ర‌స్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

ఈ చిటిచాట్‌లో చిరంజీవి హ‌రీష్ శంక‌ర్‌కు సైతం త‌న‌ను డైరెక్ష‌న్ చేసే ఛాన్స్ ఇస్తాన‌ని బంప‌ర్ ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో హ‌రీష్ త‌బ్బిఉబ్బ‌య్యాడు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు ఆచార్య సినిమా ఎప్పుడు చూపించ‌బోతున్నారంటూ హ‌రీష్ శంక‌ర్ చిరుకు ప్ర‌శ్న వేశారు. ఆ వెంట‌నే చిరు అందుకోసం ప్ర‌త్యేకంగా థియేట‌ర్ బుక్ చేశామ‌ని… అంద‌రం క‌లిసి సినిమా చూస్తామ‌ని చిరు చెప్పారు.

 

అయితే చిరు ప‌వ‌న్ కోసం స్పెష‌ల్‌గా థియేట‌ర్ బుక్ చేశామ‌ని చెప్పినా అది ఏ థియేట‌ర్ అన్న‌ది చెప్ప‌లేదు. అయితే రాఘ‌వేంద్ర‌రావుకు చెందిన మ‌ల్టీఫ్లెక్స్‌లో ప‌వ‌న్ ఆచార్య స్పెష‌ల్ షో చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ షోకు మెగా ఫ్యామిలీకి చెందిన చిరు స‌తీమ‌ణితో పాటు కొంద‌రు హీరోలు కూడా అటెండ్ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఆచార్య స్క్రీనింగ్ ఈ రోజు రాత్రి నుంచే ప్రారంభ‌మ‌వుతుంది. ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే ఆచార్య ప్రీమియ‌ర్ వ‌సూళ్లు హాఫ్ మిలియ‌న్ మార్క్‌కు చేరువ‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ‌లో రెండు చోట్లా కూడా ప్ర‌భుత్వాలు వారం రోజుల పాటు ( ఏపీలో ప‌ది రోజులు) ఐదు షోలు వేసుకునేందుకు, టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమ‌తులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news