Moviesరాజ‌మౌళి ఆమె చెప్ప‌డం వ‌ల్లే RRR సినిమా చేశాడా.. ఇంట్ర‌స్టింగ్‌..!

రాజ‌మౌళి ఆమె చెప్ప‌డం వ‌ల్లే RRR సినిమా చేశాడా.. ఇంట్ర‌స్టింగ్‌..!

జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు ఎలాంటి భారీ అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. ఇక రిలీజ్ అయ్యాక కూడా సినిమా అంచ‌నాల‌ను మించిపోయింది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా రు. 700 కోట్ల పై చిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా లాంగ్ ర‌న్‌లో ఎన్ని రికార్డులు సాధిస్తుంద‌నే అంద‌రూ వెయిట్ చేస్తున్నారు.

త్రిబుల్ ఆర్ మానియా కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే కాకుండా.. అటు నార్త్‌లోనూ.. ఇటు సౌత్‌లోనూ మామూలుగా లేదు. అటు ఓవ‌ర్సీస్‌లో అయితే ఇప్ప‌టికే 11 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు క్రాస్ చేసేసింది. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఎంతో ఉత్కంఠ ఉండేది. అయితే ఇప్పుడు పెద్ద రిలీఫ్ వ‌చ్చేసింది. ఎవ‌రికి వారు లెక్క‌లు, రికార్డుల గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాలో న‌టించిన మ‌క‌ర్ దేశ్‌పాండే ఈ సినిమాపై చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

బాహుబ‌లి సినిమాతో రాజ‌మౌళి దేశ ప్ర‌జ‌లు అంద‌రిన త‌న అభిమానుల‌ను చేసేసుకున్నాడ‌ని.. ఆయ‌న చాలా ముక్కుసూటి మ‌నిషి అని కొనియాడేశాడు. సినిమాలో త‌న‌కు మంచి రోల్ ఇచ్చార‌ని తెలిపాడు. నిజానికి బాహుబ‌లి సినిమా త‌ర్వాత రాజ‌మౌళి చిన్న సినిమా.. అది కూడా ఓ ల‌వ్ స్టోరీ చేయాల‌ని అనుకున్నార‌ని.. అయితే రాజ‌మౌళి భార్య ర‌మా రాజ‌మౌళి నీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో ? అదే చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చింద‌ని.. దీంతో రాజ‌మౌళి చిన్న సినిమా వ‌ద్ద‌నుకుని.. త్రిబుల్ ఆర్ మీద ఫోక‌స్ చేశాడ‌ని మ‌క‌ర్ దేశ్ పాండే చెప్పాడు.

 

ఇక రాజ‌మౌళి ఆలోచ‌న‌లే చాలా పెద్ద‌గా ఉంటాయ‌ని.. అందుకోసం అత‌డు చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు అని చెప్పాడు. ఇక ముందు నుంచి తాము అనుకున్న‌ట్టే ఆర్ ఆర్ ఆర్ రికార్డులు బ్రేక్ చేస్తుంద‌ని దేశ్‌పాండే తెలిపాడు. త్రిబుల్ ఆర్ స‌క్సెస్‌లో ఉన్న రాజ‌మౌళి నెక్ట్స్ మ‌హేష్‌బాబు సినిమాను తెర‌కెక్కిస్తాడు. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై డాక్ట‌ర్ కేఎల్‌. నారాయ‌ణ నిర్మించే ఈ సినిమా షూటింగ్ ద‌స‌రా నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

ఆఫ్రికా అడ‌వుల నేప‌థ్యంలో సాగే జేమ్స్‌బాండ్ స్టైల్ సినిమాగా మ‌హేష్‌బాబు సినిమా ఉంటుంద‌ని.. రాజ‌మౌళి తండ్రి స్టోరీ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇప్ప‌టికే చెప్పేశారు. ఇక ఈ సినిమాను రు. 800 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తారు అని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news