Moviesవావ్‌... బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ ' ఆదిత్య 369 ' వెన‌క ఇంత...

వావ్‌… బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ ఆదిత్య 369 ‘ వెన‌క ఇంత పెద్ద స్టోరీ ఉందా…!

హీరో నంద‌మూరి బాల‌య్య గురించి.. సినీ రంగంలో చాలానే ఆస‌క్తిక‌ర ఘ‌ట్టాలు ఉన్నాయి. ఆయ‌న న‌టించిన సినిమాలు కానీ.. ఆయ‌న వేసిన పాత్ర‌లు కానీ, చాలా చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా సాహ‌సాలతో కూడిన సినిమాలు చేయ‌డంలో బాల‌య్య‌కు పెట్టింది పేరు. అయితే.. ఈ పేరు రావ‌డానికి ముందు .. ఒక కీల‌క ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిజానికి అప్ప‌టి వ‌ర‌కు సాహ‌స పాత్ర‌లు చేసిన సినిమాలు లేవు. కానీ, ఆత‌ర్వాత‌.. మాత్రం ఏరికోరి.. బాల‌య్య ఆ సినిమాల‌ను ఎంచుకున్నారు. ఇది ఎలా జ‌రిగిందంటే.. ప్ర‌ముఖ గాయ‌కుడు.. బాలసుబ్ర‌హ్మ‌ణ్యం ఓ ఇంగ్లీష్ సినిమా చూశారు.

ఆ సినిమాలో ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌పంచం ముందుకు సాగుతోంది స‌రే.. కానీ… దీనిని కొంత వెన‌క్కి తీసుకువెళ్లి.. చూస్తే ఎలా ఉంటుంది ? అనే కోణంలో ఆ సినిమా చూపించారు. ఇది చూసిన బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం.. ఈ త‌రహాలో సినిమా తీయాల‌ని అనుకు న్నారు. దీనికి సింగీతం శ్రీనివాస‌రావును సంప్ర‌దించారు. కేవ‌లం పాస్ట్ మాత్ర‌మే చూపిస్తే.. జ‌నాల‌కు ఎక్కదు అని.. భావించిన సింగీతం.. దీనికి మ‌రికొంత క‌థ‌ను జోడించి.. ఫ్యూచ‌ర్‌లో కూడా ఏం జ‌రుగుతుంందో ? అనే విష‌యాన్ని జోడించాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ఆదిత్య 369 అనే టైటిల్‌తో సినిమాకు కూర్పు జ‌రిగింది.

వాస్త‌వానికి ఈ సినిమాను బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యానికి ప్రాణ‌మిత్రుడు అయిన‌.. క‌మ‌ల్ హాస‌న్‌తో తీయాల‌ని అనుకున్నారు. కానీ,, ఆయ‌న ఫుల్లు బిజీగా ఉండ‌డంతో బాల‌య్య తెలుగు వారికోసం అన్వేష‌ణ చేస్తున్నారు. అదే స‌మ‌యంలో నారీ నారీ న‌డుమ మురారి సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఒక పాట పాడేందుకు హైద‌రాబాద్ వ‌చ్చిన బాలు.. హీరో.. బాల‌య్య‌తో పిచ్చాపాటిగా.. ఈ విష‌యం చ‌ర్చించారు. ఇందులో ఉండే క‌థా వ‌స్తువు.. దీనికి సంబంధించిన అన్ని అంశాల‌ను ఆయ‌న‌తో చ‌ర్చించి.. నువ్వు న‌టిస్తావా ? అన్నార‌ట‌. దీనికి బాల‌య్య స‌మిరా అన్నారు.

అయితే.. త‌ర్వాత‌.. ఇదే విష‌యాన్ని.. సింగీతం శ్రీనివాస‌రావు వ‌ద్ద బాలు చెప్ప‌గానే.. బాల‌య్య అయితే.. చాలా బాగుంటాడు.. నువ్వు ఎలాగైనా ఒప్పించు.. అని ఒత్తిడి చేశార‌ట‌. దీంతో.. బాల‌య్యను ఒప్పించేందుకు ఒక‌టికి రెండు సార్లు బాలు హైద‌రాబాద్ చుట్టూ తిరిగి.. ఈ సినిమా హిట్ట‌యితే.. నీకు ఎంత పేరు వ‌స్తుందో తెలుసా? అంటూ.. చెప్పార‌ట‌. అయితే.. ఇది మాస్ కాదు.. ఫైట్లు లేవు.. క‌ష్ట‌మ‌ని.. బాల‌య్య చెప్ప‌డం.. కాదు.. పూర్తి బాధ్య‌త నాద‌ని.. బాలు.. సింగీతం చెప్ప‌డంతో ఎట్ట‌కేల‌కు ఒప్పుకొన్నాడు. ఈ సినిమా.. సూప‌ర్ డూప‌ర్ హిట్‌. దీంతో బాల‌య్య వెనుదిరిగి చూసుకునే అవ‌కాశం రాలేదట‌.

అస‌లు ఈ సినిమా అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం.. ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌. ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం.. ఇలాంటి సినిమాను మ‌నం ఎందుకు ? మిస్ అయ్యామా ? అని ఫీల్ అయ్యారు. ఇక ఆ సినిమా వ‌చ్చి ఇన్నేళ్లు అయినా ఇలాంటి సినిమాకు సీక్వెల్ చేయాల‌న్న బాల‌య్య కోరిక మాత్రం ఎప్ప‌ట‌కీ అలాగే ఉండిపోయింది. అందుకే ఆదిత్య 999 పేరుతో సీక్వెల్ చేయాల‌ని చూస్తున్నాడు. సింగీతం కూడా క‌థ రెడీ చేశాడు. మ‌రి బాల‌య్య ఎప్పుడు ఒకే చెపితే అప్పుడు ఈ సీక్వెల్ రెడీ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news