Moviesరాజ‌మౌళితో చ‌నువే నాకు మైన‌స్ అయ్యింది.... ఎన్టీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

రాజ‌మౌళితో చ‌నువే నాకు మైన‌స్ అయ్యింది…. ఎన్టీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ త్రిబుల్ ఆర్‌. ఒక‌టా రెండా ఏకంగా మూడున్న‌ర సంవ‌త్స‌రాల నుంచి షూటింగ్‌లోనే ఉందీ సినిమా. డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మించిన ఈ సినిమాకు ముందుగా రు. 250 కోట్ల బ‌డ్జెట్ అనుకున్నారు. క‌ట్ చేస్తే ఇది ఏకంగా రు. 500 కోట్ల‌కు చేరుకుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రు. 1000 కోట్ల వ‌సూళ్ల టార్గెట్‌తో త‌న యుద్ధాన్ని ప్రారంభిస్తోంది ఈ సినిమా.

ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్లు మాత్రం మామూలుగా జ‌ర‌గ‌డం లేదు. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌, ముంబై ప్ర‌మోష‌న్లు ఫినిష్ చేసిన జ‌క్క‌న్న టీం గ‌త రాత్రి దుబాయ్ ప్ర‌మోష‌న్లు కూడా చేసేసింది. అక్క‌డ జ‌రిగిన ప్రెస్‌మీట్‌కు రాజ‌మౌళి, తార‌క్, చెర్రీ హాజ‌ర‌య్యారు. దుబాయ్‌లో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో రాజ‌మౌళితో మీరు ముందు నుంచి చాలా క్లోజ్‌గా ఉంటారు ? క‌దా ? అది మీకు ప్ల‌స్ అయ్యిందా ? మైన‌స్ అయ్యిందా ? అన్న ప్ర‌శ్న ఎన్టీఆర్‌కు ఎదురైంది.

ఈ ప్ర‌శ్న‌కు ఎన్టీఆర్ సంచ‌ల‌న స‌మాధానం ఇచ్చాడు. రాజ‌మౌళితో చ‌నువుగా ఉండ‌డం త‌న‌కు మైన‌స్ అయ్యింద‌నే అన్నాడు. ఆయ‌న‌తో చ‌నువుగా ఉండ‌డం వ‌ల్లే క‌నీసం ఏ మాత్రం క‌నిక‌రం లేకుండా త‌న‌ను 65 నైట్స్ చాలా ఇబ్బంది పెట్టాడ‌ని.. త‌న కొమ‌రం భీం పాత్ర నైట్ ఎఫెక్ట్స్ సీన్స్ షూట్ చేయ‌డం స‌మ్మ‌ర్‌లో స్టార్ట్ చేశారు. ఆ సీన్ల‌లో తాను నీళ్ల‌లో త‌డిసి మ‌రీ షూటింగ్‌లో పాల్గొనాల్సి వ‌చ్చేద‌ని.. అయితే క‌రోనా వ‌ల్ల స‌మ్మ‌ర్‌లో షూటింగ్ ఆగిపోయింద‌ని… మ‌ళ్లీ షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే టైంకు చ‌లికాలం వ‌చ్చేసింద‌ని.. ఆ క‌టిక చ‌లిలో రాత్రి వేళ‌.. తెల్ల‌వారు ఝామున నీళ్ల‌తో తుడ‌స్తూ ఆ సీన్ల‌లో షూటింగ్ చేసేందుకు తన‌కు చుక్క‌లు క‌న‌ప‌డ్డాయ‌ని తారక్ చెప్పాడు.

ఆ చ‌లిలో గ‌జ‌గ‌జ వ‌ణుకుతూనే తాను షూటింగ్ చేశాన‌ని.. రాజ‌మౌళిలో ఎప్పుడూ ఫైర్ ఉంటుంది.. ఆయ‌న బాగానే ఉంటాడు. అయితే తాను మాత్రం త‌ట్టుకోలేక‌పోయాన‌ని తార‌క్ అన్నాడు. ఈ ఒక్క విష‌యాన్ని వ‌దిలేస్తే రాజ‌మౌళితో సాన్నిహిత్యం వ‌ల్ల త‌న‌కు మిగిలిన అన్ని విష‌యాల్లోనూ ప్ల‌స్‌లే ఉన్నాయ‌ని చెప్పాడు. ఇక తాను న‌టుడిగా ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవ‌డానికి కూడా ప్రధాన కార‌ణం రాజ‌మౌళీ గారే అని తార‌క్ త‌న అభిమానం చాటుకున్నాడు. ఇక రాజ‌మౌళి ఓ సినిమాను శిల్పంలా చెక్కుతాడ‌న్న కార‌ణంతోనే ముద్దుగా జ‌క్క‌న్న అని తార‌క్ పేరు పెట్టాడు.

ఇక రాజ‌మౌళి, ఎన్టీఆర్ కెరీర్ దాదాపు ఒకే టైంలో స్టార్ట్ అయ్యాయి. రాజ‌మౌళి తొలి సినిమా స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్… ఎన్టీఆర్‌కు రెండో సినిమా. వీరిద్ద‌రి కాంబోలో స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్‌, సింహాద్రి, య‌మ‌దొంగ‌.. తాజాగా త్రిబుల్ ఆర్ వస్తున్నాయి. ఇక మ‌రోసారి వీరి కాంబినేష‌న్లో త్వ‌ర‌లోనే సినిమా రానుందని కూడా రాజ‌మౌళి చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news