MoviesR R R రిలీజ్ వేళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాకింగ్ నిర్ణ‌యం.....

R R R రిలీజ్ వేళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాకింగ్ నిర్ణ‌యం.. మామూలు ర‌చ్చ కాదురా..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్ ఆర్ ఆర్‌. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ లాంటి వ‌ర‌ల్డ్ సూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా కావ‌డంతో ఈ సినిమాపై ఆకాశాన్ని దాటేసిన అంచ‌నాలే ఉన్నాయి. మూడేళ్లుగా ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తోన్న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రి 17 రోజుల టైం మాత్ర‌మే ఉంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7నే ప్ర‌పంచ వ్యాప్తంగా 14 భాష‌ల్లో త్రిబుల్ ఆర్‌ను రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. అయితే అది సాధ్యం కాలేదు.

ఒమిక్రాన్ విజృంభిస్తుండ‌డంతో పాటు ఏపీలో టిక్కెట్ల రేట్ల ఇష్యూ నేప‌థ్యంలో ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే సాహ‌సం మేక‌ర్స్ చేయ‌లేక‌పోయారు. ఇక ఈ నెల 25న రిలీజ్ అవుతున్న ఆర్ ఆర్ ఆర్‌పై 20 రోజుల ముందు నుంచే టెన్ష‌న్ పెరిగిపోతోంది. అటు ఎన్టీఆర్‌, ఇటు రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రూ కూడా థియేట‌ర్ల‌లో క‌నిపించి దాదాపు మూడేళ్లు అవుతోంది. మూడు సంవ‌త్స‌రాల నుంచి త‌మ హీరోల‌ను వెండితెర మీద చూడ‌లేదు. దీంతో ఇద్ద‌రు హీరోల అభిమానులు కూడా రిలీజ్‌కు ముందు నుంచే కావాల్సినంత హంగామాతో పాటు పెద్ద ర‌చ్చే క్రియేట్ చేస్తున్నారు.

అస‌లే భారీ పాన్ ఇండియా సినిమా.. దీంతో రికార్డుల ప‌రంగా దుమ్ము లేపాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ అస‌లే ఐదు వ‌రుస హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సినిమా కూడా హిట్ అయితే ఎన్టీఆర్ మార్కెట్‌ను ఎవ్వ‌రూ ట‌చ్ చేయ‌లేరు. ఆరు వ‌రుస హిట్లు అంటే మామూలు విష‌యం కాదు. అందుకే ఎన్టీఆర్ అభిమానులు ఇప్ప‌టి నుంచే భారీ హంగామా స్టార్ట్ చేసేశారు. ఓవ‌ర్సీస్‌లో ఓ థియేట‌ర్లో ఎన్టీఆర్ వీరాభిమాని ఏకంగా 75 టిక్కెట్లు బ‌ల్క్‌గా బుక్ చేశాడు.

మంగళవారం అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ థియేటర్ ఈవినింగ్ షో మొత్తం మ‌రో ఎన్టీఆర్ వీరాభిమాని బుక్ చేసేశాడు. ఇక ఇప్ప‌టికే ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ చేస్తోన్న ర‌చ్చ‌తో 20 రోజుల ముందు ప్రి రిలీజ్ బుకింగ్స్‌తో ఏకంగా 1 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేసేసి.. 1.5 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ వైపు ప‌రుగులు పెడుతోంది. ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమాకు 1000 థియేట‌ర్లు కేటాయించారంటే రాజ‌మౌళి స‌త్తాపై ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కులు , డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఎంత న‌మ్మ‌కం ఉందో తెలుస్తోంది.

ఇక ఆంధ్రా ఏరియాలో గోదావ‌రి జిల్లాల్లో మెగా ఫ్యాన్స్ కూడా ప్రీమియ‌ర్ షోలు ద‌క్కించుకునేందుకు పొలిటిక‌ల్ ప్రెజ‌ర్ చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా బెనిఫిట్ షోలు త‌మ‌కే ద‌క్కాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టేశారు. రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న ఆలియా భ‌ట్‌, ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్ న‌టిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news