Moviesఎన్టీఆర్‌ సెట్స్ లో ఉంటే ఎలా ఉంటుందంటే..పూజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఎన్టీఆర్‌ సెట్స్ లో ఉంటే ఎలా ఉంటుందంటే..పూజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే..ఊహించని విధంగా తన తల రాతను మార్చేసుకుంది. ఒకప్పుడు ఈమె అంటె భయపడి పారిపోయే వాళ్లు..ఇప్పుడు అమ్మడు కోసం నెలలు తరబడి వెయిట్ చేస్తున్నారు. టైం అంటే అదే. ఐరెన్ లెగ్ అని ముద్ర వేసుకున్న బ్యూటీనే ఇప్పుడు ఆ నిర్మాతల పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్-బాలీవుడ్ అంటూ సాగిన అమ్మడు కెరీర్ ఇప్పుడు కోలీవుడ్ లో కూడా స్టార్ట్ అయ్యింది. విజయ్ తో కలిసి బీస్ట్ సినిమా ద్వార తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది.

కాగా పూజా హీరోయిన్ గా ప్రభాస్ హీరో గా నటించిన పాన్ ఇండియా చిత్రం “రాధే శ్యామ్”. రాధ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ మరో ఐదు రోజుల్లో అంటే..మార్చి 11న రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు..చిత్ర బృందం. ఈ సందర్భంగా పూజా హెగ్డే హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.

మొదట సినిమా గురించి చెప్పుతూ..ఇలాంటి ఓ సినిమా ఆమె నటించినందుకు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అంటూ…ఈ సినిమా కోసం మేము చాలా కష్ట పడ్డాము అని చెప్పుకొచ్చింది. ప్రభాస్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉందని..ఆయన దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను అని చెప్పుతూ..ప్రభాస్ కి సిగ్గు ఎక్కువ అంటూ కామెంట్ చేసింది. ఇక వాళ్ళు షూటింగ్ లో ఉన్నప్పుడు తన టీంకు కోవిడ్ సోకితే..ఇంటినుండి ఫుడ్ పంపించి చాలా కేరింగ్ గా చూసుకున్నారు అంటు తెలిపింది.

టాలీవుడ్ లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అంటే..అందరు ఇష్టమే కానీ.. ఎన్టీఆర్‌ ఎనర్జీ అంటే చాలా ఇష్టం. ఆయన సెట్‌లో ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్‌ ఎనర్జీతో కనిపిస్తాడు ..అందరు అలానే ఉండేలా చేస్తాడు.. మరీ ముఖ్యంగా ఎంతటి కష్టమైన సీన్ అయినా డైలాగ్ అయినా ఒక్క టేక్‌లో చేసేస్తాడు. ఆయనతో కలిసి నటించినందుకు చాలా హ్యాపీగా ఉన్నా. మళ్ళీ అవకాశం వస్తే తప్పకుండా చేస్తా..ఇక అల్లు అర్జున్‌ కూడా ఫుల్‌..స్టైలీష్ గా ఎనర్జీగా ఉంటాడు..అంటూ తన మనసులోని మాటలను చెప్పేసింది బుట్టబొమ్మ. మరి చూడాలి ఈ సినిమా ద్వారా అమ్మడు ఎంత సక్సెస్ సాధిస్తుందో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news