Moviesనా భర్తను వాళ్ళు కరెంట్‌ వైర్లతో కాల్చి, పీక పిసికి చంపేశారు..సీనియర్...

నా భర్తను వాళ్ళు కరెంట్‌ వైర్లతో కాల్చి, పీక పిసికి చంపేశారు..సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీ అంటే పైకి కనిపించేంత మంచి కాదని..బయటకు చూడటానికి బాగా కనిపించచ్చు కానీ..లోలోపల అంత కుళ్ళు తో నిండి ఉంటుందని మరోసారి ప్రూవ్ చేసారు సీనియర్ నటి కృష్ణవేణి. బ‌తుకు తెరువు కోసం నానా క‌ష్టాలు ప‌డి మంచి స్థాయికి ఎదిగిన వారిని వెనకు లాగేందుకు కొందరు ఉంటారని..అలా బలైపోయిన వాళల్లో ఆమె కూడా ఒకరు అని పరోక్షంగా చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం జనరేషన్ కు బామ్మా గా తెలిసిన కృష్ణ వేణి వెండి తెరపై హీరోయిన్ గా అడుగు పెట్టారు. అయితే ఇండస్ట్రీలో ఉన్న కొన్ని దుష్ట శక్తుల వల్ల ఆమె హీరోయిన్ గా నటించిన రెండు సినిమాల్లో ఒకటి రిలీజ్ కు నోచుకోలేదు.. మరొకటి రిలీజ్ అయినా అంత బాగానే ఉన్నా ప్లాప్ గా చిత్రీకరించారు. దీంతో అందం అభినయం ఉన్నా హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకోలేక పోయారు కృష్ణవేణి. తాజాగా సీనియర్ నటి తన జీవితంలో జరిగిన చేదు ఘటనలను, తన భర్తను ఇండస్ట్రీ ఎలా తొక్కేసింది అనేది చెప్పుకొచ్చింది.

టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు అని మన పెద్ద వాళ్ళు చెబుతుంటారు. నా విషయంలో ను అదే జరిగింది. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం.మొదట్లో బాగానే అనిపించినా..ఆ తరువాత నా బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది.. ఒకానొక సమయంలో పూట గడవడానికి కూడా కష్టం అయింది. అలాంటి సమయంలో అమెరికాలో ఓ 90 సంవత్సరాల పెద్ద మనిషి ఇంట్లో పని మనిషిగా కూడా పని చేశానని ఎమోషనల్ అయ్యింది.

అంతే కాదు తన వైవాహిక జీవితం గురించి కూడా చెప్పుకొస్తూ.. ” ‘వారాలబ్బాయి’ డైరెక్టర్‌ రాజచంద్రను పెళ్లి చేసుకున్నాను. నిజానికి నాకు నలుపంటేనే నచ్చదు..కాని అనుకోని కారణాల చేత నల్లగా ఉండే అతడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ మేము నాలుగేళ్లే కలిసి ఉన్నాం. ఆయన చాలా మంచి వారు. అప్పుడప్పుడే సినిమాలు హిట్ పడుతున్నాయి.

ఇక లైఫ్ లో సెటిల్ అవుతాం అని అనుకునే టైంలోనే..అది చూసి ఓర్వలేక ఇండస్ట్రీవాళ్లే ఆయనను హత్య చేశారు. కరెంట్‌ వైర్లతో కాల్చి, పీక పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. కానీ మేం ఏం చేయలేం అని చేతులెత్తేశారు. కొన్ని సంవత్సరాలకి ఇలా చేసిన హీరోయిన్ కూడా చనిపోయింది” అంటూ షాకింగ్ విషయాలను బయట పెట్టింది కృష్ణ వేణీ

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news