Moviesమెగాభిమానుల‌కు కేక లాంటి న్యూస్‌... రెండు మెగా మ‌ల్టీస్టార‌ర్లు రెడీ..!

మెగాభిమానుల‌కు కేక లాంటి న్యూస్‌… రెండు మెగా మ‌ల్టీస్టార‌ర్లు రెడీ..!

మెగా అభిమానుల‌కు త‌మ ఫ్యామిలీ హీరోల మ‌ల్టీస్టార‌ర్ కోసం ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. గ‌తంలో ఎవ‌డు సినిమాలో అల్లు అర్జున్ – రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టించారు. అయితే అందులో అల్లు అర్జున్‌ది కేవ‌లం ప‌ది నిమిషాలు మాత్ర‌మే ఉండే సీన్. అయితే పూర్తిస్థాయిలో మెగా ఫ్యామిలీ హీరోలు ఓ సినిమా చేయాల‌ని మెగా ఫ్యామిలీ అభిమానులు గ‌త ప‌దేళ్ల నుంచి కోరుకుంటూనే ఉన్నారు. ఎవ‌రి బిజీల్లో వారు ఉండ‌డంతో పాటు.. ఎవ‌రి ఇమేజ్‌లు వాళ్ల‌వి కావ‌డంతో ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్ ప‌ట్టాలు ఎక్క‌డం లేదు.

అయితే ఇప్పుడు మెగా అభిమానులకు కేక పెట్టే న్యూస్ వ‌చ్చేసింది. మెగా మ‌ల్టీస్టార‌ర్ రాబోతోంది. అస‌లు విష‌యంలోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పటికే అయిదు సినిమాలు ఉండ‌గా.. ఇందులో భీమ్లానాయ‌క్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. క్రిష్ డైరెక్ట్ చేసే హరి హర వీరమల్లు షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇది కూడా ఈ యేడాదే రిలీజ్ అవుతోంది. ఆ త‌ర్వాత హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ స్టార్ట్ అవుతుంది.

ఈ మూడు సినిమాలు ఇలా ఉండ‌గానే సురేందర్ రెడ్డి-రామ్ తాళ్లూరి-జి స్టూడియోస్ కాంబినేషన్ ఫిక్స్ అయిపోయిఉంది. ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ష‌న్‌లో త్రివిక్ర‌మ్ మాట‌ల స‌హ‌కారంతో సాయిధ‌ర‌మ్ తేజ్‌తో మ‌రో సినిమా ఓకే అయ్యింది. ఇది కాకుండా ప‌వ‌న్ మ‌రో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే ఓ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తో మ‌ల్టీస్టార‌ర్‌కు ఓకే చెప్పిన ప‌వ‌న్ ఇప్పుడు మ‌రో మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌తో మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు ఎవ‌రు ? బ్యాన‌ర్ ఏంట‌న్న‌ది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే వైష్ణ‌వ్‌తేజ్ – ప‌వ‌న్ సినిమాకు క‌థ రెడీ అయ్యింద‌ని.. దీనికి ప‌వ‌న్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలిసింది. ఏదేమైనా 2024 ఎన్నిక‌ల‌కు ముందే ప‌వ‌న్ ఈ సినిమాలు అన్నీ పూర్తి చేయాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news