Moviesమళ్లీ వాయిదా పడ్డ ప్రభాస్ సినిమా..డార్లింగ్ అభిమానులకు బిగ్ షాక్..!!

మళ్లీ వాయిదా పడ్డ ప్రభాస్ సినిమా..డార్లింగ్ అభిమానులకు బిగ్ షాక్..!!

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ సినిమా వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ డిస్సపాయింట్ మెంట్ లో ఉన్నారు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు మన డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాధేశ్యామ్’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పలు సార్లు వాయిదా పడగా..ఏట్టకేలకు మార్చి 11న రిలీజ్ చేయడానికి మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

ఇక ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ‘సలార్’. ఈ సినిమా కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది. అంతేకాకుండా ప్రభాస్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఆది పురుష్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కింది. రామాయ‌ణంలోని ఓ ఘ‌ట్టం ఆధారంగా ఆదిపురుష్ సినిమాను ప్రభాస్ తో తెరకెక్కించాడు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్. ఈ సినిమాలో రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తుండ‌గా… ప్ర‌తినాయ‌కుడు రోల్లో బాలీవుడ్ క్రేజీ హీరో సైఫ్ ఆలీఖాన్ న‌టిస్తున్నాడు. ఇక సీత పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటి కృతి సనన్ నటిస్తుంది. ప్రభాస్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాతంకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

అయితే సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి కూడా ఈ మూవీను 2022 ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ధీమాగా చెప్పారు. కాని ఇప్పుడు కొన్ని కారణల వల్ల రిలీజ్‌ డేట్‌ను మార్చిన్నత్లు తెలుస్తుంది. దానికి కారణం లాల్ సింగ్ చ‌ద్ధా . ఆమీర్ ఖాన్, నాగ‌చైత‌న్య‌ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా విడుదల తేదీని మార్చడంతో ఆ ప్రభావం ఆదిపురుష్‌పై పడింది. లాల్ సింగ్ చ‌ద్ధా సినిమా నిజానికి ఏప్రిల్ 14న విడుద‌ల కావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది..ఇంకా చాలా సీన్స్ పెండింగ్ లో ఉన్నాయి.

దీంతో సినిమా రిలీజ్ డేట్ ను మారుస్తూ టీం అఫిషియల్ గా కొత్త డేట్ ప్రకటించింది. . ఆదిపురుష్ రిజ‌ర్వ్ చేసుకున్న ఆగస్టు 11నే తమ లాల్ సింగ్ చ‌ద్ధా సినిమాను రిలీజ్ చేస్తాను మేకర్స్. కాగా  విషయాని ఆదిపురుష్ చిత్ర బృందంతో మాట్లాడారని..వాళ్ళకు ఓకే అయిన తరువాతనే ఈ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు లాల్ సింగ్ చ‌ద్ధా టీం తెలిపింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఈక్రమంలో ప్రస్తుతం ఆదిపురుష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news