Moviesక‌లిసుండాల‌ని ఐశ్వ‌ర్య - ధ‌నుష్ షాకింగ్ డెసిష‌న్‌... ఇంతలోనే ఏం జ‌రిగింది...!

క‌లిసుండాల‌ని ఐశ్వ‌ర్య – ధ‌నుష్ షాకింగ్ డెసిష‌న్‌… ఇంతలోనే ఏం జ‌రిగింది…!

కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వ‌ర్య‌, ఆమె భ‌ర్త అయిన కోలీవుడ్ క్రేజీ హీరో ధ‌నుష్ కొద్ది రోజుల క్రిత‌మే తాము విడిపోతున్న‌ట్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే తాము విడిపోతున్న‌ట్టు వారు చెప్పారు.వారిది 18 ఏళ్ల వైవాహిక జీవితం. ఎంతో అన్యోన్యంగా ఉండే వారు ఎందుకు విడిపోతున్నారో ? ఎవ్వ‌రికి అర్థం కాలేదు. అటు ర‌జ‌నీకాంత్ సైతం త‌న కుమార్తె దాంప‌త్య జీవితాన్ని నిలిపేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు కూడా ఫెయిల్ కావ‌డంతోనే వారు విడిపోక త‌ప్ప‌లేద‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది.

అస‌లు వీరు విడిపోవ‌డానికి కార‌ణం ఏంట‌న్న‌ది తెలియ‌క‌పోయినా ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపించాయి. ధ‌నుష్‌కు ఓ హీరోయిన్‌తో రిలేష‌న్ కార‌ణంగానే ఐశ్వ‌ర్య ప‌దే ప‌దే చెప్పి చూసింద‌ని.. అయినా ధ‌నుష్‌లో మార్పు లేక‌పోవ‌డంతోనే అత‌డితో విడిపోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చింద‌న్న టాక్ వినిపించింది. ఇక ఐశ్వ‌ర్య‌కు కోలీవుడ్ యంగ్ హీరో శింబుతో గ‌తంలో ప్రేమాయ‌ణం ఉంద‌ని.. ఇప్పుడు కూడా అత‌డితో కాంటాక్ట్‌లో ఉందంటూ ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఓ వైపు వీరి విడాకుల ప్రాసెస్ జ‌రుగుతుండ‌గానే.. ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిసి ఉండే ఆలోచ‌న చేస్తున్నార‌న్న వార్త‌లు బాగా వైర‌ల్ అవుతున్నాయి. వీరికి టీనేజ్‌లో ఉన్న ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. వారికోస‌మే వీరు క‌లిసే ఆలోచ‌న చేస్తున్నార‌ని అంటున్నారు. వీరు ఇప్ప‌టికే విడాకుల‌కు అప్లై చేశారు. వీరు భార్య‌, భ‌ర్త‌లుగా ఉండ‌క‌పోయినా కూడా పిల్ల‌ల కోసం అప్పుడ‌ప్పుడూ క‌లుసుకునేలా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

గ‌తంలో విడాకులు తీసుకున్న వారిలో బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్‌, టాలీవుడ్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి వాళ్లు పిల్ల‌ల కోసం క‌లుస్తున్నారు. పిల్ల‌ల ఫంక్ష‌న్ల‌లో క‌లుసుకోవ‌డం, వారి విష‌యాల‌ల్లో క‌లిసే ఉండ‌డం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఐశ్వ‌ర్య – ధ‌నుష్ భార్య‌, భ‌ర్త‌లుగా విడిపోయినా త‌మ పిల్ల‌ల కోసం మాత్రం క‌లిసే ఉంటార‌ని కోలీవుడ్‌లో వినిపిస్తోన్న మాట‌. ఏదేమైనా పిల్ల‌ల కోసం క‌లిసుండాల‌ని వీరు తీసుకున్న నిర్ణ‌యం అభినంద‌నీయం..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news