Newsఎన్టీఆర్‌తో ఆ ద‌ర్శ‌కుడు సినిమా... హీరోయిన్‌గా జాన్వీ ఫిక్స్‌..!

ఎన్టీఆర్‌తో ఆ ద‌ర్శ‌కుడు సినిమా… హీరోయిన్‌గా జాన్వీ ఫిక్స్‌..!

ఆంధ్రుల అతిలోకసుందరి, అలనాటి హీరోయిన్ శ్రీదేవి తెలుగులోనే పాపుల‌ర్ హీరోయిన్ అయ్యింది. ఆమె కోలీవుడ్‌కు చెందిన న‌టి అయినా ఆమెను నెత్తిన పెట్టుకుని స్టార్ హీరోయిన్‌ను చేసింది మాత్రం తెలుగు వాళ్లే. మూడు ద‌శాబ్దాల క్రింద‌ట ఆమె తెలుగు నుంచే బాలీవుడ్‌కు వెళ్లి అక్క‌డ ఓ ఊపు ఊపేసింది. ఇక ఆమె కుమార్తె జాన్వీ ఇప్ప‌టికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తోంది. జాన్వీని తెలుగులోకి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నాలు గ‌త రెండేళ్లుగా జ‌రుగుతూనే ఉన్నాయి.

అప్పుడెప్పుడో పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్‌బాబు హీరోగా జ‌న‌గ‌న‌మ‌ణ ప్రాజెక్టును తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. పూరి కూడా ఈ స్క్రిఫ్ట్‌పై పెద్ద హ‌డావిడే చేశాడు. అయితే ఆ ప్రాజెక్టు మ‌హేష్‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో ప‌క్క‌న పెట్టేశారు. ఆ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాతోనే ఆమె ఇక్క‌డ హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంద‌న్న వార్త కూడా గుప్పుమంది.

ఇక ఎన్టీఆర్ ప‌క్క‌న జాన్వీ ఫిక్స్ అయ్యింద‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది. అయితే ఇప్పుడు ఈ కాంబినేష‌న్ ఫైన‌ల్‌గా సెట్ అయిన‌ట్టే తెలుస్తోంది. మైత్రీ మూవీస్ వాళ్లు ఎన్టీఆర్ సినిమా తీస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో దీనిని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలోనే జాన్వీని ఎన్టీఆర్ ప‌క్క‌న న‌టింప జేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి ఉప్పెన‌లా దూసుకువ‌చ్చిన బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్టు టాక్ ?

బుచ్చిబాబు సానా కూడా ఎన్టీఆర్‌తో సినిమా కోస‌మే క‌థ రెడీ చేసుకుని.. యేడాది కాలంగా వెయిటింగ్లో ఉన్నాడు. ఉప్పెన త‌ర్వాత చాలా అవ‌కాశాలు వ‌చ్చినా.. ఎన్టీఆర్‌తోనే సినిమా చేయాల‌ని క‌సితో రెండు, మూడు క‌థ‌లు రెడీ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో జాన్వీక‌పూర్‌ను హీరోయిన్‌గా తీసుకుంటే సినిమాకు పాన్ ఇండియా క్రేజ్‌తో పాటు నార్త్‌లో మ‌రింత ప్ల‌స్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news