Moviesఆయనను మహేష్ దూరం పెడుతున్నాడా..దూరం అవుతున్నాడా..?

ఆయనను మహేష్ దూరం పెడుతున్నాడా..దూరం అవుతున్నాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ పని చేసినా దానికి ఓ అర్ధం ఉంటుంది అని ఆయన అభిమానులు గట్టిగా నమ్ముతారు. లేనిపోని తగ్గదాలకు పోకుండా ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయకుండా ఉండే మన అతి తక్కువ మంది తెలుగు హీరోలల్లో మహెష్ కూడా ఒకరు. అనిల్ రావిపూడి తో సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా సర్కారు వారిపాట. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో మనకు తెలిసిందే. కానీ ఈ సినిమా అనుకోని కారణాల రీత్య వాయిదా పడుతూ..వెనక్కి వెనక్కి పోతూనే ఉంది. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే అభిమానులను టెన్షన్ పెట్టే విధంగా మహేష్ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. యస్.. ఇప్పుడు మహేష్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఆయన అభిమానులను ఎంతగానో టెన్షన్ పెడుతున్నాయని అంటున్నారు నెటిజన్స్. అందుకు కారణం మహెష్ బాబు పూరి జగన్నధ్ డైరెక్షన్ లో ఓ సినిమా ని వదులుకోవడమే. ఎన్నో ఏళ్లుగా మహేష్ బాబు పూరి కాంబో లో ఓ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. వీళ్ల కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “పోకిరి” మూవీ బాక్స్ ఆఫిస్ దవ్వ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు మహేష్ కెరీర్ కు పోకిరి సినిమా ఎంతో ప్లస్ ని ఇచ్చింది. ఇక అదే ఊపులో రెండోసారి బిజినెస్ మెన్ సినిమా చేయగా అది కూడా ప్రేక్షకులను భారీ స్థాయిలో మెప్పించింది.

ఇక వీరిద్దరి కాంబోలో మూడో సినిమాగా “జనగణమన ” అనే సినిమా రాబోతుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే అనూహ్యంగా మహేష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆల్మోస్ట్ ఖరారు అనుకున్న ప్రాజెక్టు ను సైతం మధ్యలో క్యాన్సిల్ చేశాడు మహేష్. ఆ ప్లేస్ లోకి యంగ్ హీరో విజయ్ దేవరకొండ సెలక్ట్ అయిన్నట్లు కూడా వార్తలు రావడంతో మహేష్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఎందుకు మహేష్ మంచి సినిమాలను మిస్ చేసుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news