Moviesఆ డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తే విడాకులే.. చైతు, ధనుష్‌ల‌తో స‌హా ఇంకెవ‌రెవ‌రు...

ఆ డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తే విడాకులే.. చైతు, ధనుష్‌ల‌తో స‌హా ఇంకెవ‌రెవ‌రు బ‌ల‌య్యారంటే?

కోలీవుడ్‌ బ్యూటిఫుల్ క‌పుల్ ధ‌నుష్, ఐశ్వర్యలు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా క‌నిపించే ఈ జంట‌.. విడాకులు తీసుకుంటున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా అధికారికంగా తెలియ‌జేసి అంద‌రికీ ఊహించ‌ని షాక్ ఇచ్చారు. అయితే ధ‌నుష్ విడాకుల వ్య‌వ‌హారం ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల మెడ‌కు చుట్టుకుంది. ఆయ‌న వ‌ల్లే హీరోలు వారి భార్య‌ల‌తో విడిపోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

`డాలర్ డ్రీమ్స్` సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా మారిన శేఖ‌ర్ క‌మ్ముల.. త‌న‌దైన టాలెంట్‌తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఆయ‌న త‌న ఇన్నేళ్ల కెరీర్‌లో చాలా వ‌ర‌కు పెళ్లి కాని హీరోలతోనే సినిమాలు చేశారు. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. పెళ్ళైన హీరోలతో శేఖ‌ర్ క‌మ్ముల సినిమా చేసిన ప్రతిసారి సదరు హీరోలు తమ భార్యలకు విడాకులు ఇచ్చేశారు. ఇలా ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు.. ఏకంగా ముగ్గురు హీరోలు బ‌లైపోయారు.

డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల హీరో సుమంత్‌తో `గోదావరి` సినిమా చేశాడు. కమలినీ ముఖర్జీ ఇందులో హీరోయిన్‌గా న‌టించింది. 2006లో విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌య‌మే సాధించింది. కానీ, అదే ఏడాది సుమంత భార్య కీర్తి రెడ్డితో విడిపోయాడు.

శేఖ‌ర్ క‌మ్ముల అక్కినేని నాగ చైత‌న్య‌తో `ల‌వ్ స్టోరి` సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం 2021లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్‌గా హిట్‌గా నిలిచింది. అయితే చైతు ప్రేమించి పెళ్లి చేసుకున్న స‌మంత‌కు గ‌త ఏడాదే విడాకులు ఇచ్చి త‌న దారి తాను చూసుకున్నాడు.

ఇక ఈ మ‌ధ్య ధ‌నుష్ శేఖ‌ర్ క‌మ్మ‌ల‌తో ఓ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. క‌ట్ చేస్తే ధ‌నుష్ సైతం ఐశ్వ‌ర్య‌తో విడిపోయాడు. వీరిద్ద‌రూ పెళ్లై 18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోమవారం ప్రకటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news