Moviesవిజ‌య‌వాడ అమ్మాయితో పెళ్లి పీఠ‌లు ఎక్కుతోన్న అఖిల్ ?

విజ‌య‌వాడ అమ్మాయితో పెళ్లి పీఠ‌లు ఎక్కుతోన్న అఖిల్ ?

తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు నట వారసులు వస్తూనే ఉన్నారు. వీరిలో చాలా మంది సక్సెస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. అక్కినేని నాగార్జున రెండో తనయుడు అయిన అఖిల్.. అఖిల్ సినిమాతో హీరోగా మారాడు. కెరీర్ ఆరంభంలో ఒక్క హిట్ సినిమా కోసం ఇబ్బందులు పడ్డ అఖిల్ గత ఏడాది వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అఖిల్ చిన్నప్పుడే సిసింద్రీ సినిమాతోనే నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక గతంలోనే అఖిల్ కు ప్రముఖ పారిశ్రామిక వేత్తల కుటుంబానికి చెందిన శ్రీయ భూపాల్ తో చాలా గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. శ్రియా భూపాల్ ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే కంపెనీల అధినేతకు మనవరాలు. అయితే వీరి పెళ్ళి ఇటలీలో చాలా వైభవంగా చేయాలని నాగార్జున ప్లాన్ చేశారు. అంతలోనే ఓ చిన్న పార్టీలో వీరిద్దరి మధ్య జరిగిన సంఘటన తీవ్రమైన మనస్పర్థలకు కారణం కావడంతో వీరి పెళ్లి క్యాన్సిల్ అయింది. అలా వీరిద్దరూ విడిపోయారు. ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యాక శ్రీయా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనయుడిని పెళ్లి చేసుకున్నారు. అయితే అఖిల్ కు ఇంకా పెళ్లి కాలేదు.

ఎట్టకేలకు అఖిల్ కు పెళ్లి చేసేయాలని నాగార్జున నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుమార్తెను తన ఇంటి కోడలిగా చేసుకోవాలని నాగ్‌ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ కుటుంబానికి చిత్రపరిశ్రమకు ఎలాంటి సంబంధాలు లేవని… ఆమె కుటుంబం సంప్రదాయబద్ధమైన కుటుంబం అని తెలుస్తోంది. వీళ్లకు హైదరాబాద్ లో భారీ ఎత్తున ఆస్తులతో పాటు వ్యాపారాలు కూడా ఉన్నట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

ఇటీవలే నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య తన భార్య సమంతతో విడిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నాగ్‌.. రెండో కుమారుడు అఖిల్‌కు పెళ్లి చేసి కాస్త రిలాక్స్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే అఖిల్ పెళ్లికి సంబంధించిన న్యూస్ రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news