Moviesమాకు సంసారాలు లేవా అంటూ ఆ న‌టిపై రాజేంద్ర ప్ర‌సాద్ ఫైర్‌..!

మాకు సంసారాలు లేవా అంటూ ఆ న‌టిపై రాజేంద్ర ప్ర‌సాద్ ఫైర్‌..!

హాస్యబ్రహ్మ, నటకిరీటి ఇలా ఎన్నో బిరుదులు సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ సొంతం. తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ – ఏఎన్నార్ – సూపర్ స్టార్ కృష్ణ ఆ తర్వాత తరంలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు వచ్చినా కూడా వారితో పోలిస్తే రాజేంద్రప్రసాద్‌ది సపరేట్ ఇమేజ్. కామెడీ ప్రధానంగా చేసుకుని సూపర్ డూపర్ బ్లాక్ బ‌స్టర్ హిట్లు కొట్టిన ఘనత రాజేంద్రుడు సొంతం. ఇన్ని దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో రాజేంద్రప్రసాద్ తర్వాత.. ఆ తరహా కామెడీ ఇమేజ్ తెచ్చుకున్న హీరోలు ఎవరూ లేరు. ఒక్క‌ అల్లరి నరేష్ మాత్రమే కొంత వరకు రాజేంద్ర ప్రసాద్ బాటలో సక్సెస్ అయ్యారు.

రాజేంద్రప్రసాద్ గురించి ప్రముఖ నటి పూజిత ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన చాలా మంచి నటుడు అని… అయితే ఆయనకు కోపం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఆయన మంచి నటుడు అవడం వల్లే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సత్తా చాటుతూ చాలా బిజీగా ఉంటున్నారు అని మెచ్చుకున్నారు. గతంలో రాజేంద్రప్రసాద్ ఓ సందర్భంలో తన మీద కూడా కోపంతో విపరీతంగా అరిచిన‌ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఒక సినిమాలో ఓ సీన్ షూటింగ్ జరుగుతూ ఉండగా రాజేంద్ర ప్రసాద్‌ను తోసేయాల‌ట‌. పూజిత రాజేంద్ర ప్రసాద్ ను గట్టిగా తోసేయ‌డంతో ఆయన వెళ్లి ఒక తలుపున‌కు గుద్దుకున్నార‌ట‌. వెంటనే పూజిత రాజేంద్రప్రసాద్ దగ్గరకు పరిగెత్తుకొని వెళ్తే ఆయన గట్టిగా అరిచి.. కేక‌లు వేశార‌ట‌. ఆ తర్వాత ఆయనతో సీన్ చేయాలి అంటే తనకు చాలా భయం వేసింది అని.. చాలా టేక్‌లు తీసుకోవాల్సి వచ్చిందని పూజిత చెప్పారు.

ఎక్కువ టేక్ లు తీసుకోవడంతో రాజేంద్రప్రసాద్ కోపంతో త‌న ద‌గ్గ‌ర‌కు వచ్చి.. ఏమ్మా నువ్వు సరిగా చేయలేవా ? మాకు కూడా సంసారాలు ఉన్నాయి… మా వాళ్ళు వచ్చారు… మేము వెళ్లాలి అనేసరికి తనకు ఎంతో బాధ వేసిందని పూజిత చెప్పారు. కోపంతోనే చివరకు తాను ఆ సీన్‌ పూర్తి చేశానని చెప్పారు.ఆ సీన్ షూటింగ్ అయ్యాక తాను ఏడుస్తుంటే డైరెక్ట‌ర్ వ‌చ్చి స‌ర్ది చెప్పార‌ని పూజిత చెప్పింది. మ‌రుస‌టి రోజు తాను షూటింగ్‌కు వెళ్ల‌ను అని అంటే త‌న తండ్రి నీకు ఇష్ట‌మ‌య్యే ఇక్క‌డ‌కు వ‌చ్చావుగా.. ఇప్పుడు వెళ్ల‌ను అంటావేంటి ? అని త‌న తండ్రి త‌న‌తో చెప్పార‌ని నాటి సంగ‌తులు పూజిత గుర్తు చేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news