Moviesఆ విష‌యంలో ప్ర‌భాస్ - ఎన్టీఆర్ సేమ్ టు సేమ్‌.. రాజ‌మౌళి...

ఆ విష‌యంలో ప్ర‌భాస్ – ఎన్టీఆర్ సేమ్ టు సేమ్‌.. రాజ‌మౌళి చెప్పిన సీక్రెట్ ఇదే..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంతా త్రిపుల్‌ ఆర్ మేనియా నెలకొంది. వ‌చ్చ‌చే సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు ఈ సినిమా దర్శక ధీరుడు రాజమౌళి ముగ్గురు కలిసి ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని భాషలలోనూ ముంబై – చెన్నై – హైదరాబాద్ లాంటి ప్రముఖ నగరాల్లో ప్రమోషన్లు జరుగుతున్నాయి. టాలీవుడ్లో ఈ సినిమా ప్రమోషన్ కు కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం వచ్చారు. ఇక చెన్నైలో జరిగిన కోలీవుడ్ ప్రమోషన్‌కు ఎమ్మెల్యే, యువ హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ కూడా వ‌చ్చాడు.

ఇక చెన్నైలో జ‌రిగిన ఈవెంట్‌లో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఎన్టీఆర్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఎన్టీఆర్‌తో పాటు త‌న బాహుబ‌లి హీరో ప్ర‌భాస్ పేరు ప్ర‌స్తావిస్తూ ఇద్ద‌రికి లింక్ పెట్టి మాట్లాడారు. ఓ విష‌యంలో ఎన్టీఆర్‌కు, ప్ర‌భాస్‌కు చాలా ద‌గ్గ‌రి పోలిక‌లు ఉన్నాయ‌ని రాజ‌మౌళి చెప్పుకువ‌చ్చారు. ఫుడ్ విష‌యంలో వారిద్ద‌రు కూడా సేమ్ టు సేమ్ అని చెప్పాడు. ఇక యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం అన్న విష‌యం తెలిసిందే.

తన‌కు న‌చ్చిన ఐటెంలు ఇష్టంగా తిన‌డంతో పాటు త‌న చుట్టు ప‌క్క‌ల ఉన్న వారితో కూడా తినిపిస్తాడు. తాను ఏ సినిమాలో న‌టిస్తున్నా ఆ సినిమా యూనిట్ సభ్యులు అంద‌రూ కూడా ప్ర‌భాస్ ఫుడ్ ఐటెంలు త‌ప్ప‌క తినాల్సిందే. ఇక అలాగే ఎన్టీఆర్ కూడా ప్ర‌భాస్‌లా ఫుడ్‌ను బాగా ఇష్ట‌ప‌డ‌తాడ‌ట‌. ర‌క‌ర‌కాల ఫుడ్ ఐటెంలు మ‌నోడు ట్రై చేస్తూ ఉంటాడ‌ట‌. అయితే ఎన్టీఆర్ ఇష్టంగా తిన‌డంతో పాటు వండ‌డం కూడా బాగా తెలిసిన వ్య‌క్తి అని రాజ‌మౌళి చెప్పాడు.

అలాగే ఎన్టీఆర్ సెట్స్‌లో అంద‌రికంటే ముందు ఉంటాడ‌ని.. త‌న పాత్ర విష‌యంలో రాజీప‌డ‌డు అని చెప్పాడు. ఇక త్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్‌కు ఖ‌చ్చితంగా పాన్ ఇండియా ఇమేజ్ వ‌స్తుంద‌న్న అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news