Moviesసినిమా చూడటానికి ఆటోలో వచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సినిమా చూడటానికి ఆటోలో వచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

శ్రీయ సరన్..ఒక్కప్పుడు తన అందం తో నటనతో కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేసిన ఈ బ్యూటీ తెలుగులో ఇష్టం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తి తక్కువ సమయంలోనే శ్రియ శరణ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి..మంచి మార్కులు కొట్టేసింది. తెలుగుతో పాటుగా, తమిళ, హింది చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం హీరోయిన్‌గా న‌టించిన శ్రీయ .. పెళ్లి తరువాత సినిమాలు తగ్గించేసింది.

కాగా చాలా కాలం తరువత శ్రియ సరన్‌ ‘గమనం’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆమె తాజాగా నటించిన గమనం మూవీ డిసెంబర్‌ 10 థియేటర్లో విడుదలై..మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని సుజ‌నారావు రూపొందించారు. ఈ చిత్రంలో ప్రియాంక జ‌వాల్క‌ర్ , నిత్యామీన‌న్, సుహాస్, ర‌విప్ర‌కాశ్, శివ కందుకూరి న‌టించారు. కాగా ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందించారు. కలి ప్రొడక్షన్స్, క్రియా ఫిల్మ్ కార్ప్ బ్యానర్లపై రమేశ్ కురుటూరి, వెంకీ పుష్పదపు, వీఎస్ జ్ఞానశేఖర్ నిర్మించారు.

కాగా ఈ సినిమాని చూసేందుకు శ్రీయ ఆటోలో ధియేటర్కు వచ్చింది. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. శ్రియ కుకట్‌పల్లి మల్లిఖార్జున థియేటర్లో సందడి చేసింది. కాగా థియేటర్‌కు శ్రియా ఆటోలో రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కూకట్‌పల్లి దగ్గర నిజాంపేట్‌ క్రాస్‌ రోడ్‌ వద్ద ఉన్న మల్లీఖార్జున థియేటర్‌కు ఆమె సినిమా చూసేందుకు వచ్చింది. శ్రియ ఆటోలో వస్తుందని ఎవ్వరు ఊహించలేదు. ఆమె ప్రేక్షకులతో కలిసి సినిమా చూసారు. అనంతరం ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది శ్రియ. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది శ్రియ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news