Moviesసినిమాల మోజుతో అడవి శేష్ ఇంత పెద్ద తప్పు చేసాడా..?

సినిమాల మోజుతో అడవి శేష్ ఇంత పెద్ద తప్పు చేసాడా..?

టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉన్నా కానీ కొందరి సినిమాలు చూస్తుంటే మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తాయి. ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అలాంటి వారిలో ఈ అడవి శేష్ ఒకరు. టాలీవుడ్లో వైవిధ్యభరితమైన సినిమాలు చేసే అడవి శేష్..మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి.. ఆతరువాత ఆయన హీరో గా మారాడు. కర్మ అనే సినిమా తో వచ్చిన అడవిశేష్.. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన పంజా సినిమాలో మెరిసాడు. నిజానికి ఈ సినిమా ఫ్లాప్ అయినా..పవంకు కూడా రాని మంచి పేరు మంచి పాపులారిటి అడవి శేష్ దక్కించుకున్నాడు. ఆ సినిమాలో సైకో విలన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.

ఇక ఆ తరువాత వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ.. కీలక పాత్రల్లో నటిస్తూ మనల్ని మెప్పించాడు. అంతేనా ఓవైపు ప్రత్యేక పాత్రలు పోషిస్తూనే హీరోగా చేస్తూ వచ్చాడు శేష్. క్షణం సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. క్షణం సినిమాలో శేష్ నటనకు అందరు ఫిదా కాగా, గూఢచారి తో హీరో గా నిలదొక్కుకున్నాడు అడవిశేష్. అయితే ఈయన లైఫ్ లో పడిన కష్టాలు చూస్తే పగ వాదికి కూడా ఈ పరిస్ధితులు రాకుడదు అనిపిస్తాయి. నిజానికి ఈయన పేరు అడవి శేష్ కాదు. అడవి శేష్ అసలు పేరు సన్నీ చంద్ర. అతని తండ్రి ఓ డాక్టర్.

ఆయన తండ్రీ ఈయనను కూడా డాక్టర్ చేయాలి అనుకున్నాడట కానీ అడవి శేష్ కి చిన్ననాటి నుంచి సినిమాలంటే ఇష్టంతో ఈ రంగంలోకి అడుగు పెట్టారట. ఎంతో ఇష్టం పెంచుకున్న అడివి శేష్ సినిమాల్లోకి రాకముందు వెబ్ డిజైన్గ్ ద్వారా డబ్బులు సంపాదించేవాడట. అలా దాచి వచ్చిన డబ్బుతోనే కర్మ అనే మూవీ చేస్తే..ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కోట్టి తీవ్రంగా నిరాశ పరిచింది.

అంతేకాదు సినిమాలపై ఉన్న ఆసక్తితో అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలి ఇండియా కి వచ్చి.. తొందరపడి తన దగ్గర ఉన్న డబ్బులు అన్నింటితో సినిమాలు నిర్మించాడట. తాను నిర్మించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో చివరికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నాడట. పర్స్తుతం మేజర్ ఉన్ని కృష్ణన్ నిజ జీవిత కథతో తీస్తున్న మేజర్ మూవీలో అడవి శేష్ నటిస్తున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని అడివి శేష్ భావిస్తున్నాడు. ఫాన్స్ కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news