Moviesఫ్యాన్స్ ను హుషారెత్తించే అప్డేట్..ఏం ప్లాన్ వేశావయ్య సుకుమార్..?

ఫ్యాన్స్ ను హుషారెత్తించే అప్డేట్..ఏం ప్లాన్ వేశావయ్య సుకుమార్..?

ప్రస్తుతం మనం చూసిన్నట్లైతే బడా బడా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా స్టార్ హీరో ల సినిమాలు వరుసగా బాక్స్ ఆఫిస్ వద్ద సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప”, వరుణ్ తెజ్ నటిస్తున్న “గని”, నాని నటిస్తున్న “శ్యాం సింగరాయ్”, రాం చరణ్-తారక్ నటిస్తున్న ” ఆర్ ఆర్ ఆర్” పవన్ కళ్యాణ్ నటిస్తున్న”భీంలా నాయక్”..ప్రభాస్ నటిస్తున్న “రాధే శ్యాం”, చరణ్- చిరంజీవి నటిస్తున్న”ఆచార్య”..ఇలా బడా హీరోల సినిమాలు అన్నీ ఒకదాని తరువాత ఒకటి రిలీజ్ కానుండడంతో బాక్స్ వాద్ద పండగ వాతవరణం నెలకొంది.

ఇక ఆ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్స్ అయితే..సినిమాల రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ పనులను స్పీడ్ అప్ చేస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు తమ సినిమాలని ప్ర్మోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా మూవీగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం “పుష్ప”కి ప్రమోషన్స్ చేస్తున్నారు సుక్కు. ఇక ఈ సినిమానుంచి విడుదలైన ఈ సినిమా పోస్టర్లు , టీజర్స్, సాంగ్స్ అన్నీ సినిమా పై అంచనాలను పెంచేశాయి. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ నేపధ్యంలోనే సుకుమార్ అద్దిరిపోయే ప్లాన్ వేసిన్నట్లు తెలుస్తుంది.

డిసెంబర్ 12న గ్రాండ్ గా జరగబోతున్న పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు గెస్ట్ల ను ఆహ్వానించిన్నట్లు తెలుస్తుంది. అది కూడా బడా హీరోల లిస్ట్ లో ఉన్న వారిని కావడం గమనార్హం. దీంతో ఈ ఈవెంట్ కు వచ్చే ఆ ముగ్గురు గెస్ట్స్ ఎవరా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇక ఈ ఈవెంట్ కు నట సింహం నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నారని టాక్ వినిస్తుంది. దానికి కారణం ఇటీవల అఖండ ఈవెంట్ కు బన్నీ హాజరయ్యాడు. కాగా బాలయ్య తో పాటు మెగాస్టార్ చిరంజీ,పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా గ్రాండ్ గా జరగనున్న ఈ ప్రీరిలీజ్ హాజరుకానున్నారట. దీంతో అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news