Moviesజై భీం సినిమాలో సూర్య పక్కన నటించిన ఈ టీచర్ ఎవరో...

జై భీం సినిమాలో సూర్య పక్కన నటించిన ఈ టీచర్ ఎవరో తెలుసా?

విలక్షణ నటుడు సూర్య నటించిన జై భీమ్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సొంతం చేసుకుంది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య లాయర్ గా చించేశాడు. సూర్యకు జోడీగా ఈ సినిమాలో రాజిష విజయన్ నటించింది. ఈ అమ్మడుకి సూర్యతో ఇదే తొలి సినిమా. ఈ మూవీలో రాజిష మారుమూల ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు అక్షరాలు నెంబర్లు నేర్పిస్తుంటారు. ఈ సినిమాలో రాజిష చాలా కీలక పాత్రను పోషిస్తుంది. పోయిన ఏడాది ఆకాశమే నీ హద్దురా వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూర్య ఈ ఏడాది జై భీమ్ సినిమాతో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ లోనే విడుదలయ్యాయి.

స్ర్కీన్ మీద చాలా ప్రెష్ గా కనిపించిన రాజిష త్వరలోనే తెలుగు సినిమాలో నటించనుంది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో రాజిష మెరవనుంది. కాగా రాజిష కేరళలో 1991లో జన్మించింది. ఆమె తండ్రి విజయన్ ఆర్మీలో పని చేసేవాడు. తల్లి గృహిణి. రాజిషకు ఒక చెల్లెలు కూడా ఉందట. రాజిష నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ మరియు జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది.

 

సినిమాల్లోకి రాక ముందు యాంకర్ గా రాజిష వర్క్ చేసింది. అనురాగ కరిక్కన్ వెల్లం అనే మళయాల సినిమా ద్వారా రాజిష ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 2016లో రిలీజయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మళయాలం తర్వాత రాజిష తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రాజిష తమిళంలో బిజీ నటిగా మారిపోయారు. అతి త్వరలోనే రాజిషను తెలుగు తెరపై మనం చూడబోతున్నాం. రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో రాజిష సెలెక్ట్ అయింది. సో అతి త్వరలోనే మనం రాజిషను తెలుగు తెరపై చూడబోతున్నామన్న మాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news