Newsటీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌: ఇండియా హిస్టరీ చూసుకుంటే.. పాక్ లో ఆ ఆశ...

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌: ఇండియా హిస్టరీ చూసుకుంటే.. పాక్ లో ఆ ఆశ పుడుతుందా ..?

టీ 20 ప్రపంచకప్‌‌లో భాగంగా భారత్- పాకిస్తాన్‌ల మధ్య జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్‌‌ కోసం ఇరు దేశాల అభిమానులకే కాదు యావత్ క్రీడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ అంటేనే అదో థ్రిల్‌. దాయాదిపై స‌మ‌రం ఓ సూప‌ర్ ఎన్‌కౌంట‌ర్‌లా ఉంటుంది. ఇక క్రికెట్ ప్రేక్ష‌కులు టీవీల‌కే హ‌త్తుకుపోతారు. ఇప్పటి వరకూ ప్రపంచకప్‌ టోర్నీల్లో ఒక్కసారి కూడా పాక్‌ చేతిలో భారత్ ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పాక్ జట్టు కసిగా ఉంది. గెలుపును ఫ్యాన్స్ తమ దేశ ప్రతిష్టగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

అయితే , ఇప్ప‌టివ‌ర‌కు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండియా, పాకిస్థాన్ జ‌ట్లు అయిదుసార్లు త‌ల‌ప‌డ్డాయి. ఆ అయిదు మ్యాచుల్లో ఇండియాదే పైచేయి. మినీ ఫార్మాట్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పొరుగు దేశం పాకిస్థాన్‌పై ఇండియా ఇప్ప‌టి వ‌ర‌కు ఓడిపోలేదు. ప‌వ‌ర్‌ఫుల్ షాట్ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించే ఈ ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై ఇండియానే త‌న ఆధిప‌త్యాన్ని చాటింది. 2007లో రెండుసార్లు మ్యాచ్‌ జరగ్గా… తొలి మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. అయితే ‘బౌల్‌ అవుట్‌’లో భారత్‌ గెలుపొందింది.

ఆ తర్వాత ఫైనల్లో 5 పరుగులతో నెగ్గిన ధోని సేన చాంపియన్‌గా నిలిచింది. గత మూడు ప్రపంచకప్‌లలో భారత్‌ ఏకపక్ష విజయాలు (8 వికెట్లతో, 7 వికెట్లతో, 6 వికెట్లతో) సాధించింది. ఈ మూడు మ్యాచ్‌లలో విరాట్‌ కోహ్లి ఒక్కసారి కూడా అవుట్‌ కాకపోవడం (78 నాటౌట్, 36 నాటౌట్, 55 నాటౌట్‌) విశేషం. కాగా… భారత్- పాకిస్తాన్‌ సరిహద్దుల్లోని ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని సామాజిక మాధ్యమాలతో పాటు రాజకీయ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (భ్ఛ్ఛీ) కీలక ప్రకటన చేసింది. ఇదే విషయమై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రసంస్థలపై కఠినంగా చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news