Moviesఅసలు ఈ భూమ్మీద ఉండే అర్హతే లేదు..షాకింగ్ వీడియోను షేర్ చేసిన...

అసలు ఈ భూమ్మీద ఉండే అర్హతే లేదు..షాకింగ్ వీడియోను షేర్ చేసిన రష్మి ..అసలు ఏమైందంటే..?

రష్మి గౌతమ్.. ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో..? సినిమాల్లో కూడా ఈ భామ పేరును వాడేస్తున్నారు. అంతగా క్రేజ్ తెచ్చుకుంది ఈమె. బుల్లితెరపై వివిధ కార్యక్రమాల్లో తనదైన స్టైల్లో యాంకరింగ్ చేసి అతికొద్ది కాలంలోనే భారీ పాపులారిటీ తెచ్చుకుంది రష్మీ. అంతే కాదు…ముఖ్యంగా చిట్టి పొట్టి డ్రెస్ లతో హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ… ఎప్పుడు త్రేండింగ్ లో ఉంటుంది.

బుల్లితెర యాంకర్ గా… జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యి లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న రష్మి గౌతమ్.. ఒకప్పుడు హీరోయిన్‌గా కూడా తన పెర్ఫామెన్స్ చూపిస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ .. ఎప్పటికప్పుడు తన షోల వివారాలతో పాటు గ్లామరెస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కాకరేపుతోంది. అయితే అందల ఆరబోతలలోనే కాదు.. మూగ జీవాలను హింసించిన తనదైన స్టైల్లో బుద్ధి చెపుతుంది రష్మి.

రీసెంట్ గా మధ్యప్రదేశ్‌ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి రష్మి ఫర్ అయ్యారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని దేవాస్‌లో ఇటీవల మున్సిపల్‌ సిబ్బంది వీధి కుక్కులను పట్టుకోడానికి వచ్చారు. ఈ క్రమంలో ఓ వీధి కుక్కకు తాడు కట్టి దాన్ని విపరీతంగా కొట్టి..దారుణంగా హింసించారు. ఇక్కడ షాకింగ్ ఎమిటంటే..చుట్టూ ఉన్న ఏ ఒక్కరు కూడా ఆపడానికి ప్రయత్నించలేదు..ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రష్మి ఫైర్ అయింది. మనకు ఈ భూమ్మీద ఉండే అర్హతే లేదు’ అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొచ్చింది.. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news