Newsరోహిత్‌శ‌ర్మ‌ పై ఫ్యాన్స్ ఫైర్.. కోహ్లీ స్టన్నింగ్ ఆన్సర్..!!

రోహిత్‌శ‌ర్మ‌ పై ఫ్యాన్స్ ఫైర్.. కోహ్లీ స్టన్నింగ్ ఆన్సర్..!!

ICC టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో నిన్న్ జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. పాకిస్థాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓట‌మి చెందింది. భార‌త్ నిర్దేశించిన 152 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పాకిస్థాన్ ఇంకా 13 బంతులు మిగిలి ఉండ‌గానే సునాస‌యంగా ఛేదించింది. దాయాదులపోరులో పాకిస్తాన్ సాధించిన విజయంతో టీమ్ ఇండియా రికార్డు బ్రేక్ అయింది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చరిత్ర తిరగరాసింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇండియాపై తొలి విజయాన్ని నమోదు చేసింది.

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా దాయాది దేశం పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపనర్ రోహిత్ శర్మ గోల్డన్ డకౌట్ కావడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్ శర్మ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో టీమిండియా ఒక పరుగు స్కోరు వద్ద ఒక వికెట్ కోల్పోయింది. అతి తక్కువ స్కోరుకే రెండు వికెట్లు కోల్పోవడం పట్ల ఇండియా ఫ్యాన్స్​ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ మరీ రెచ్చిపోయి అతని పై మరిన్ని మీమ్స్‌ తో రోహిత్ శర్మ ఆటతీరును ఏకిపారేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మ్యాచ్​ అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో రోహిత్​ శర్మ వైఫల్యంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు..కెప్టెన్ విరాట్ కోహ్లీ..మైండ్ బ్లాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి రోహిత్‌ను తొలగిస్తారా? అని జర్నలిస్ట్ అడగ్గా..కోహ్లీ ఫైర్ అవుతూ.. గత మ్యాచ్‌లో రోహిత్​ శర్మ ఎలా ఆడాడో మీకు తెలుసుగా? ఇదేం ప్రశ్న. మీకేమైనా వివాదాస్పద వ్యాఖ్యలు కావాలంటే ముందే చెప్పండి.. అందుకు తగ్గట్టే సమాధానం ఇస్తా. అంటూ మండి పడ్డారు. కానీ నెట్టింట మాత్రం కీలకమైన మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ శర్మ… కోహ్లీ స్థానంలో టీమిండియాకు సారథి కావాలని కోరుకోవడం సరికాదని కొందరు మండిపడుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news