Moviesబాలయ్య గొప్ప మనసు..ఆ డబ్బులంతా వాళ్లకేనట..గ్రేట్..!!

బాలయ్య గొప్ప మనసు..ఆ డబ్బులంతా వాళ్లకేనట..గ్రేట్..!!

నందమూరి బాలకృష్ణ ఎవ్వరూ ఊహించని విధంగా ఒక టాక్ షోను హోస్ట్ చేయబోతున్నారు. కేవలం తెలుగువారి కోసమే ఓటీటీగా ప్రారంభమయ్యి.. పలు క్రియేటివ్ షోలతో ఆడియన్స్‌ను మెప్పిస్తోంది ఆహా. ఇప్పుడు అందులోనే హోస్ట్‌గా తన జర్నీని ప్రారంభించనున్నాడు బాలయ్య. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ పేరుతో ఒక టాక్ షోను ప్రారంభించనున్నట్టు ఆహా ఇప్పటకే స్పష్టం చేసింది. తాజాగా ఆ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు కూడా. ఇక బాలయ్య ఫ్యాన్స్ అంతా తనను డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు.

ఈ టాక్‌ షోకు బాలయ్య తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ ఆసక్తిగా మారింది. ‘అన్‌స్టాప‌బుల్‌’ పేరుతో వస్తోన్న ఈ టాక్‌ షో కోసం బాలయ్య భారీ పారితోషికమే అందుకుంటున్నారట. బాలయ్య రేంజ్‌, క్రేజ్‌ దృష్ట్యా అల్లు అరవింద్ అండ్ ఆహా టీం ఆయనకు భారీగానే ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ షో కోసం బాలయ్య తన స్థాయికి తగ్గట్లే భారీగా పారితోషకం తీసుకోబోతున్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. ఎపిసోడ్‌కు రూ.40 లక్షల చొప్పున.. మొత్తంగా రూ.4.8 కోట్ల మొత్తం రెమ్యూనరేషన్‌గా బాలయ్య పుచ్చుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే తాజా ఆయన గురించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏమిటంటే.. ఆహా షో కి హోస్ట్ చేస్తున్న బాలయ్య ఆ డబ్బును మొత్తం ఛారిటీకి ఇచ్చేస్తున్నారట. అల్లు అరవింద్ ఇచ్చిన పర్తి రూపాయి కూడా ఆ ఛారిటీకి వెళ్లిపోతుందట. అందుకె అల్లు అరవింద్ సైతం డబ్బు గురించి ఆలోచించకుండా..బాలయ్యకు భారీ మొత్తంలో పారితోషకం ఇచ్చుకుంటున్నాడట. ఈ వార్త తెలిసిన బాలయ్య అభిమానులు ద్ట్ ఇస్ బాలయ్య..అంటూ బాలయ్య గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news