Moviesఆ విషయంలో చిరంజీవిని ప్ర‌శ్నించ‌నున్న బాల‌కృష్ణ‌...అభిమానుల్లో క్యూరియాసిటీ..?

ఆ విషయంలో చిరంజీవిని ప్ర‌శ్నించ‌నున్న బాల‌కృష్ణ‌…అభిమానుల్లో క్యూరియాసిటీ..?

చిరంజీవి-బాలకృష్ణ..ఇద్దరు టాలీవుడ్ కి రెండు కళ్లు లాంటి వారు. ఇద్దరికి కోట్లల్లో అభిమానులు ఉంటారు. విళ్లిద్దరి మధ్య మంచి స్నెహ బంధమే ఉంది. కానీ మెగా ఫ్యామిలీకి-నందమూరి ఫ్యామిలీకి ఏవో గోడవలు అంటూ పుకార్లు వస్తుంటాయి. ఆ గాసిప్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా బాలకృష్ణ-చిరంజివీ ఎక్కడ ఎదుటపడిన ఆప్యాయంగా నవ్వుతూ పలకరించుకుంటారు.

సరికొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో జోరు మీదున్న ‘ఆహా’.. తాజాగా మరో సంచలనానికి తెర తీస్తోంది. ఓటీటీలో తొలిసారి ఓ టాక్‌ షోను నిర్వహించడానికి రంగ సిద్ధం చేసింది. ఇక మారుతున్న ట్రెండ్‌ను ఫాలో అవుతూ బాలకృష్ణ ఓటీటీ మాధ్య‌మంలోకి అడుగు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు ఓటీటీ మాధ్య‌మ‌మైన ‘ఆహా’లో ఆయ‌న హోస్ట్‌గా ఓ టాక్‌షోను ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. నందమూరి బాలకృష్ణతో కలిసి టాక్‌ షో నిర్వహించనున్నాం అంటూ అధికారికంగా ప్రకటన చేసింది. రీసెంట్ గా బాలకృష్ణ టాక్ షో కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అనే సాలిడ్ పేరు ఫిక్స్ చేశారు. దీపావ‌ళి నుంచి ఈ టాక్ షో ప్ర‌సారం కానుంది. ఈ టాక్‌షోలో మొదట గెస్ట్ గా టాలీవుడ్ మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, రాం చరణ్ వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు, మెగాస్టార్ చిరంజీవి, మ‌రో మెగా హీరో.. చిరు త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను అన్‌స్టాప‌బుల్ టాక్‌షోకు అతిథులుగా ఆహ్వానించే ప్ర‌య‌త్నాలు ముమ్మరంగా చేస్తున్నార‌ట అల్లు అర‌వింద్. దీంతో ఈ షోపై అటు బాలయ్య అభిమానుల్లో..ఇటు మెగాస్టార్ క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటి వరకు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన బాలయ్య బాబు తొలిసారి ఇంటర్వ్యూ చేస్తుండడంపై అందరిలోనూ ఆసక్తినెలకొంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news