Moviesఅభిమానుల కోసం బాలకృష్ణ డబుల్ ధమాకా.. ఏంటో తెలుసా..??

అభిమానుల కోసం బాలకృష్ణ డబుల్ ధమాకా.. ఏంటో తెలుసా..??

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినా అది లేదని తేలిపోయింది. ఇక దీంతో ఈ సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చని అంటున్నారు. ఇక ఈ సినిమా పై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు.

అయితే ఆ తరువాత బాలకృష్ణ గోపిచంద్ మల్లినేని దర్శకత్వంలో..ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. . మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు కంప్లీట్ చేసిన గోపీచంద్ మలినేని .. నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడనే టాక్ వినిపిస్తుంది.నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు ఈ సినిమాను రూపొందించ‌డానికి క‌థ‌ను సిద్ధం చేశారు.

పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక చరిత్రకారుడు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న రోల్స్ చేస్తున్నారు. ఆయన కోసం రెండు వేరియేషన్స్ రెడీ చేశాడట. ఒక రోల్‌లో ఫ్యాక్షనిస్ట్‌గా, మరో పాత్రలో ఆధ్యాత్మిక గురువుగా బాలయ్య కనిపిస్తారని సమాచారం. అయితే ప్రస్తుతం చేస్తున్న ‘అఖండ’లో ఒక పాత్ర అఘోరా. మళ్లీ వెంటనే స్వామీజీగానో ఆధ్మాత్మిక గురువుగా నటించి ఫ్యాన్స్ కి ఢబుల్ ధమాకా ఇవ్వనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news