Moviesమూడంటే మూడే..నితిన్ సంచలన నిర్ణయం..?

మూడంటే మూడే..నితిన్ సంచలన నిర్ణయం..?

యంగ్ హీరో నితిన్.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అయింది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో నితిన్ కూడా ఒకడు. “జయం” సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఇన్ని సంవత్సరాల్లలో హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు నితిన్. ఈ సంవత్సరంలో ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేసారు నితిన్. అందులో చెక్ సినిమా ఆశించనంతగా హిట్ కాకపోగా.. రంగ్ దే మూవీ పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది.

ఇక ఇప్పుడు ‘మ్యాస్ట్రో’ అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూపర్ హిట్ మూవీ ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌‌గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. నభా నటేష్, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించనుండటం విశేషం. ఓటీటీ వేదిక హాట్ స్టార్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అయితే నితిన్ మరో  డైరెక్టర్ తో ఇంకో సినిమాను లైన్ లో పెట్టేసాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో తన తదుపరి ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగనల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్ తో “ఏజెంట్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయిన తరువాత పవన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు సురేందర్ రెడ్డి. అయితే పవన్ తో సినిమాకు చాలా టైం ఉండడంతో సురేందర్ రెడ్డి .. ఈలోపు సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ యంగ్ హీరో నితిన్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇప్పటికే నితిన్ కు కథ నచ్చగా.. ఆ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభమవుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం మూడు అంటే మూడు నెలల్లోనే పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news