Moviesవావ్: ఫ్యాన్స్‌కు మంచి కిక్కిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్..!!

వావ్: ఫ్యాన్స్‌కు మంచి కిక్కిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్..!!

ఎన్టీఆర్ ఇప్పుడు సినీ తెర మీదే కాదు బుల్లి తెర మీద కూడా మంచి క్రేజ్ సంపాదించేసాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తారక్ ఈ షోను హోస్ట్ చేస్తుండడంతొ కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ మాటల తూటాలు బుల్లితెర ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో తారక్ లుక్,మాటలు..తారక్ కలుపుగోలుతనం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.

ఇందులో తారక్ మీసకట్టు లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇక ఈ షోలో మొదటి గెస్ట్ గా “RRR” కో స్టార్ రామ్ చరణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత డైనమిక్ డైరెక్టర్స్ కొరటాల శివ..రాజమౌళిని ఈ షో కి గెస్ట్లు గా పిలిచారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు కూడా ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మహెష బాబు తారక్ షో షూటింగ్ పూర్తైంది. షోకు సంబంధించిన ఫొటో కూడా ఒకటి బయటకు వచ్చింది.. ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దసరా సందర్భంగా ప్రసారం కానుందని. ఇక ఈ షోలో మహేష్ తారక్ మధ్య మాటలు చాలా ఫనీగా జరిగాయని టాక్. అంతేకాదు మహేష్ బాబు- ఎన్టీఆర్ మధ్య జరిగిన సంభాషణ ఇరువురు హీరోల ఫ్యాన్స్‌కి కిక్కిస్తుందని అంటున్నారు. ఇక ఈ షో లో మహేష్ బాబు మొత్తం పాతిక లక్షల రూపాయలు గెలుచుకున్నారనే వార్త కూడా లీకైంది. ఇక ఆ మొత్తాన్ని ఛారిటీకి డొనేట్ చేశారట మహేష్ బాబు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news