Moviesవిజిల్ వేసి మరి హ్యాట్సాఫ్‌ చెప్పిన ప్రభాస్..ఎందుకో తెలుసా..??

విజిల్ వేసి మరి హ్యాట్సాఫ్‌ చెప్పిన ప్రభాస్..ఎందుకో తెలుసా..??

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ప్రభాస్‌, గోపిచంద్‌ స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి గతంలో వర్షం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెరపై వీరు కలిసి కనిపించకపోయినా.. ఆఫ్ స్క్రీన్‌లో వీరి బంధం కొనసాగుతోంది. వర్షంతో మొదలైన వీరి ఫ్రెండ్ షిప్ నేటీకి కొనసాగుతోంది. ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌కు పెరిగిన త‌న ఫ్రెండ్ గోపీచంద్‌కు ఎప్ప‌టికీ సపోర్ట్ చేస్తూ వ‌స్తున్నాడు.

గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ సీటీమార్ . భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలైన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు గోపీచంద్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమాల్లో సీటీమార్ కూడా నిలిచింది. స్పోర్ట్స్ డ్రామాకు సోషల్ ఇష్యూను ముడిపెడుతూ సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తొలిరోజునే దాదాపు నాలుగు కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. సెకండ్ కోవిడ్ స‌మ‌యంలో దేశం యావ‌త్తు విడుద‌లైన సినిమాల్లో టాప్‌ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా సీటీమార్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది

ఈ సినిమా చూసిన ప్రభాస్‌ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా గోపీచంద్ సీటీమార్ మూవీ హిట్ కావడంతో ప్రభాస్ సంతోషం వ్యక్తం చేశాడు. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో గోపీచంద్‌ను, సీటీమార్ స‌క్సెస్ పై విజిల్ బొమ్మ‌ను పోస్ట్ చేశాడు. “నా స్నేహితుడు గోపిచంద్‌ సీటీమార్‌ తో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడున్న కోవిడ్ సెకండ్ వేవ్‌ ప‌రిస్థితుల్లో తొలి భారీ చిత్రాన్ని రూపొందించి విడుద‌ల చేసిన టీమ్‌కు హ్యాట్సాఫ్‌’’ అంటూ ప్రభాస్ పోస్ట్ చేసాడు. ప్ర‌భాస్ ఇలా స‌పోర్ట్ చేయ‌డం చూసిన నెటిజ‌న్స్ నిజంగానే మా ప్ర‌భాస్ మ‌న‌సు ఎంతో మంచిద‌ని ప్ర‌శంసిస్తున్నారు.

 

 

 

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news