Moviesఅందరిని కంటతడి పెట్టిస్తున్న ఉత్తేజ్ కూతురి పోస్ట్..!!

అందరిని కంటతడి పెట్టిస్తున్న ఉత్తేజ్ కూతురి పోస్ట్..!!

టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఉత్తేజ్ భార్య పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.భార్య దూరం అవడం తో ఉత్తేజ్ పరిస్థితి మరింత బాధాకరం గా ఉంది. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన నటులు.. ఆయన విలపిస్తుంటే చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి గత కొంత కాలం గా కాన్సర్ తో బాధపడుతున్నారు. ఉత్తేజ్ సతీమణి పద్మావతి గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ నందమూరి బాలకృష్ణకు చెందిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. పద్మ మరణవార్త అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, జీవిత, ఇతర టాలీవుడ్ నటులు ఉత్తేజ్ ఇంటికి చేరుకున్నారు. చిరంజీవి ఉత్తేజ్‌ని అతని కుమార్తెను ఓదార్చారు. ఉత్తేజ్ తన భార్య మరణంతో తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నాడు. పద్మావతి మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఉత్తేజ్ కూతురు తన సోషల్ మీడియా లో పెట్టిన భావోద్వేగమైన పోస్ట్ అందరిని కన్నీరు పెట్టిస్తుంది. తన తల్లితో పాటు ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ..“అమ్మా లవ్ యు సో మచ్. నిన్ను నేను బాగా మిస్ అవుతాను. నాన్నని, నన్ను, అక్కని తొందరగా వదిలేసి వెళ్లిపోయావు. ఐ లవ్ యు అమ్మా. నా ఫ్యూచర్ ని అలా వదిలేసావ్ ఏంటి అమ్మా. ఐ లవ్ యూ ఫరెవర్ అమ్మా. అమ్మా నువ్వు మళ్ళీ అక్క కడుపులో పుడతావు. నాకు తెలుసు. ఐ లవ్ యు అమ్మా” అంటూ ఎమొషనల్ పోస్ట్ చేసింది.

 

 

View this post on Instagram

 

A post shared by paata d mutant 🤞 (@paatauttej1424)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news