Newsవారెవ్వా..దిమ్మ‌తిరిగే మ‌రో మ‌ల్టీస్టార‌ర్ మూవీ..అభిమానులకు పండగే పండగ..??

వారెవ్వా..దిమ్మ‌తిరిగే మ‌రో మ‌ల్టీస్టార‌ర్ మూవీ..అభిమానులకు పండగే పండగ..??

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. మల్టీ స్టారర్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు స్టార్ హీరోలతో ప్రయోగాలు చేస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓ సినిమాలో నటిస్తే.. అది ఫ్యాన్స్‌కి పండుగగానే నిలుస్తోంది. ఈ తరంలో ముందుగా వెంకటేష్ ,మహేష్ బాబు లు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మల్టీ స్టారర్ మూవీ ని చేసారు. తరువాత వెంకటేష్ -రామ్ ల మసాలా , సునీల్ – నాగ చైతన్యల తడాఖా వంటి మల్టీ స్టారర్ మూవీస్ వచ్చాయి . కానీ ఇప్పుడు ఏకంగా కుర్ర హీరోలతో సీనియర్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకుంటూ మల్టీ స్టారర్ మూవీస్ ల ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

ప్రస్తుతం రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో “ఆర్ఆర్ఆర్” అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామచరణ్ ‘అల్లురి సీతారామరాజు’ పాత్రలో నటిస్తున్నారు. అయితే దక్షిణాది నుంచి దిమ్మతిరిగే మరో మల్టీ స్టారర్ రాబోతుంది అని గాసిప్స్ మొదలు కాగా, ఇందులో రాం చరణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలు పోషించనున్నారనే వార్త సోషల్ మీదియాలో హాట్ టపిక్ గా మారింది.

ప్రభాస్‌కి ఎంతో సన్నిహితులైన యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మాతలు ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు ‘సాహో’ సినిమాకు దర్శకత్వం వహించిన సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారని.. ఇందులో ప్రభాస్, రామ్‌‌చరణ్ కలిసి నటిస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే అటు ప్రభాస్ ఫ్యాన్స్ కి..ఇటు మెగా ఫ్యాన్స్ కి పండగే పండగా..!!

 

 

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news