Gossipsచిరుతో రోమాన్స్ కు "నై"..బాలయ్యకు "సై"..ఆ హీరోయిన్ పై మెగా ఫ్యాన్స్...

చిరుతో రోమాన్స్ కు “నై”..బాలయ్యకు “సై”..ఆ హీరోయిన్ పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం..??

సౌత్ ఇండియాలో రెండు ద‌శాబ్దాలుగా హీరోయిన్‌గా కొన‌సాగుతూ వస్తుంది త్రిష‌. 21 ఏళ్లుగా సినిమాల్లో ఉన్న త్రిష‌కు ఇప్పుడు 37 ఏళ్లు వ‌య‌స్సు వ‌చ్చినా ఈ ముదురు ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోకుండా…సినిమా ఆఫర్లతో బిజీ బిజీ గా గడిపేస్తుంది. అప్పుడెప్పుడో జోడీ సినిమాతో సినిమాల్లోకి వ‌చ్చిన ఆమె తెలుగులో నీ మ‌న‌సు నాకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. అన‌తి కాలంలోనే సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ఈ చెన్నై చిన్న‌ది.

ఇది ఇలా ఉండగా తాజాగా ఆమె పై మెగా ఫ్యాన్స్ కోపం గా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే..?? మెగాస్టార్ చిరంజీవి పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కే లూసీఫ‌ర్ రీమేక్‌ లో చిరు పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే అమ్మడు ఆ ఆఫర్ క్లు నో చెప్పిందట. అయితే, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ్ తో జోడీగా నటించేందుకు మాత్రం రెడీ అవుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్యతో సినిమా అనగానే త్రిష వెంటనే ఓకే చేసిందనే టాక్ వినిపిస్తోంది.

ఈ విషయం బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ ఆమె పై ఫైర్ అవుతున్నారట. చిరంజీవితో ఛాన్స్ వచ్చినా వదులుకుంది కానీ బాలకృష్ణతో మాత్రం రోమాన్స్ కు సై అనడంలో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇది ఇలా ఉండగా మరోవైపు నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య- త్రిష కాంబినేషన్‌ని వెండితెరపై చూడబోతున్నామని తెలిసి తెగ సంతోషపడిపోతున్నారు. మరి చూడాలి వీళ్ల జంట ఎలా అలరిస్తుందో..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news