Moviesమెగాస్టార్ నటించిన ఏకైక హాలీవుడ్ మూవీ ఇదే..కానీ ఆగిపోయింది..రీజన్ తెలిస్తే షాక్...

మెగాస్టార్ నటించిన ఏకైక హాలీవుడ్ మూవీ ఇదే..కానీ ఆగిపోయింది..రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవికి ఉన్న పేరు ప్రఖ్యాతలు అన్ని ఇన్ని కావు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒంటరిగా సినిమా ఇండస్ట్రీ లోకి ప్రవేశించి ఆయన ఎదిగిన తీరు అసామాన్యం. ఎంతో మందికి స్పూర్తి కలిగించిన చిరంజీవి ప్రయాణం ఇంకెంతో మంది ఇండస్ట్రీకి రావడానికి కారణం అయ్యింది. టాలీవుడ్ లో నే కాకుండా సౌత్ మొత్తం అన్ని భాషలలో ఆయన సినిమాలు విడుదల చేస్తూ అక్కడ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అక్కడి ఫ్యాన్స్ ని ఖుషి చేయడం కోసం ఆయన డైరెక్ట్ గా సదరు భాషలలో సినిమాలు కూడా చేసి వారిని మేప్పించాడు.

బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసి అక్కడ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా టాలీవుడ్ మీద ప్రేమతో ఇతర భాషలలోకి ఎక్కువగా వెళ్లలేదు.అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటేందుకు చిరంజీవి ఓ హాలీవుడ్ చిత్రానికి కూడా పూనుకున్నారు. ది రిటర్న్ ఆఫ్ ద తీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి సినిమాను రేపోమాపో మొదలు పెట్టి పూర్తి చేయాలని అనుకున్నారు.

సినిమా రంగంలో ప్రకటించిన సినిమాలన్నీ విడుదల కావు. దానికి రకరకాల కారణాలుంటాయి. కొన్ని సినిమాలు ప్రకటనలకే పరిమితం అవుతాయి. మరికొన్ని సినిమాలు షూటింగ్ మొదలై ఆగిపోతాయి. ఇంకొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదల కావు. సినిమాలు రీలీజ్ కాకపోవడానికి సవాలక్ష కారణాలుంటాయి. వాటిలో చిన్న హీరోలు ఉంటారు. పెద్ద హీరోలు కూడా ఉంటారు. కారణం ఏదైనా అలా మొదలై ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాడు. వాటిలో చిరంజీవి నటించిన అబు సినిమా కూడా ఒకటి

సురేష్ కృష్ణ దర్శకత్వంలో 90వ దశకంలో `అబు బాగ్దాద్ గజదొంగ` చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ సినిమాలో మనిషా కోయిరాలా హీరోయిన్ గా చేసింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇండియన్ టెక్నీషియన్స్ తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కలిసి వర్క్ చేసి తొలి భారతీయ చిత్రమిది. అప్పట్లోనే పాన్ ఇండియా స్థాయిలో 50 కోట్ల భారీ వ్యయంతో ఈ మూవీని ప్లాన్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. సినిమా షూటింగ్ మాత్రం మధ్యలో ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోవడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఖురాన్ చాలా పురాతనమైనది అని చెప్పడానికి బురదలో నుంచి బయటకు తీస్తారట. ఈ సన్నివేశం ముస్లింల సెంటిమెంటును దెబ్బతీసేలా ఉందని సౌదీ అరేబియాలో కేస్ నమోదయ్యింది. అయితే కొంత మంది ముస్లీమ్ నేతల ఒత్తిళ్ల కారణంగా ఈ మూవీ అర్థాంతరంగా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికీ దీనికి సంబంధించిన ఎలాంటి క్లిప్ బయటికి రాలేదు. ఈ మూవీని పూర్తి చేయాలని చిరు డ్రీమ్ కానీ అది నెరవేరలేదు. రామ్చరణ్ ఈ చిత్రాన్ని మళ్లీ రివైవ్ చేయాలని ప్రయత్నించినా చిరులో మార్పులు రావడంతో ఇది అసాధ్యమని పక్కన పెట్టేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news