Gossipsబన్నీ సార్ బన్నీ అంతే.. ఏం చేసినా ఒక లెక్క ఉంటుంది.....

బన్నీ సార్ బన్నీ అంతే.. ఏం చేసినా ఒక లెక్క ఉంటుంది.. ఏం చేసాడో చూడండి..!!

గత ఏడాదిలో విడుదల అయిన టాలీవుడ్ చిత్రాల్లో బిగ్గెస్ట్ చిత్రం ఏది అంటే మరో మాట లేకుండా అల వైకుంఠపురంలో అనడంలో సందేహం లేదు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా నాన్ బాహుబలి రికార్డును దక్కించుకుంది. ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న అల వైకుంఠ పురంలో సినిమా ను హిందీలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి

అల్లు అర్జున్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ హిందీలో ‘షహజాదా’గా రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక్కడ అల్లు అర్జున్, పూజా హెగ్డే పోషించిన పాత్రలను హిందీలో కార్తీక్ ఆర్యన్, కృతీ సనన్ పోషించబోతున్నారు. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను హిందీ మేకర్స్ దాదాపుగా పది కోట్లకు గాను కొనుగోలు చేశారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నాడట. నిజానికి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్ళబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోనూ అతిథి పాత్ర చేయమని దర్శక నిర్మాతలు కోరుతున్నారట. అయిదు నుండి పది నిమిషాల స్క్రీన్ ప్రజెన్స్ ఉండే ఒక గెస్ట్ రోల్ కోసం బన్నీని సంప్రదించారట. అందుకు మన బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు లో నటిస్తున్న ప్రతి సినిమా ను కూడా బాలీవుడ్ లో విడుదల చేసేలా పాన్ ఇండియా సబ్జెక్ట్ ను యూనివర్షల్ సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకుంటున్నాడు. పుష్ప సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా ఇటీవల ఒక సర్వేలో బాలీవుడ్ ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. ఇక ‘షహజాదా’ పేరుతో గతంలోనే రాజేశ్‌ ఖన్నా ఓ సినిమా చేశారు. ఇప్పుడు అదే టైటిల్ తో కార్తీక్ ఆర్యన్ మూవీ చేయడం విశేషం. దీన్ని డేవిడ్ ధావన్ తనయుడు రోహిత్ ధావన్ తీయబోతున్నాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news