Politicsకిలేడీ భార్య‌... భ‌ర్త తాగుడు మాన్పించేందుకు వ‌చ్చిన డాక్ట‌ర్‌తోనే... క్లైమాక్స్ ఇదే..!

కిలేడీ భార్య‌… భ‌ర్త తాగుడు మాన్పించేందుకు వ‌చ్చిన డాక్ట‌ర్‌తోనే… క్లైమాక్స్ ఇదే..!

త‌న భ‌ర్త మ‌ద్యానికి బాసిన కావ‌డంతో త‌న ఇద్ద‌రు కుమారుల‌కు పెళ్లి కావ‌ట్లేద‌ని ఓ మ‌హిళ ఆయుర్వేద డాక్ట‌ర్‌తో క‌లిసి భ‌ర్త‌ను చంపేసింది. రంగారెడ్డి జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లంలోని ఎన్‌ఎఫ్‌సీనగర్‌కు చెందిన దర్జీ గంగాపురం అంజయ్య(57), భవాని దంపతులకు ఇద్దరు కుమారులు. భ‌ర్త నిత్యం తాగి వ‌చ్చి భార్య‌ను, కుమారుల‌ను రోజూ వేధిస్తున్నాడు. భ‌ర్త‌కు మ‌ద్యం అల‌వాటు మాన్పించేందుకు భార్య ఆయుర్వేద డాక్ట‌ర్ స‌తీష్‌కుమార్ ( 45)ను ఆశ్ర‌యించింది.

Wife murders husband Archives - Hindi Khabre

ఈ ప‌రిచ‌యంతో ఆమె ఆ ఆయుర్వేద డాక్ట‌ర్‌తోనే వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. ఈ క్ర‌మంలోనే భ‌ర్త తాగుడు మాన‌క‌పోవ‌డం, ఇటు త‌న వివాహేత‌ర సంబంధానికి ఇబ్బందిగా ఉంద‌ని భావించిన భ‌వానీ డాక్ట‌ర్ స‌తీష్‌తో భ‌ర్త‌ను చంపేయాల‌ని కోరింది. దీంతో డాక్ట‌ర్ ఇచ్చిన మ‌త్తు మాత్ర‌లు భ‌ర్త అంజ‌య్య‌కు ఇచ్చింది. మ‌త్తులో ఉన్న అంజ‌య్య త‌ల‌పై దిండు పెట్టి చంపేందుకు ప్ర‌య‌త్నించారు.

 

పారిపోయేందుకు ప్ర‌య‌త్నించిన అంజ‌య్య త‌ల‌పై రోక‌లి బండ‌తో కొట్ట‌డంతో అత‌డు మృతి చెందాడు. అయితే అంద‌రిని న‌మ్మించేందుకు గుర్తె తెలియ‌ని వాహ‌నం ఢీకొట్ట‌డంతో అంజ‌య్య గాయాల పాల‌య్యి ఇంటికి వ‌చ్చిన కొద్ది సేప‌టికే చ‌నిపోయాడ‌ని కొడుకుల‌ను, స్థానికుల‌ను న‌మ్మించింది. అయితే పోలీసుల విచార‌ణ‌లో భ‌వానీయే డాక్ట‌ర్ స‌తీష్‌తో క‌లిసి భ‌ర్త‌ను చంపేసింద‌ని తెలియ‌డంతో ఇద్ద‌రిని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news