Moviesమాఫియా టార్గెట్‌లో ఎన్టీఆర్ హీరోయిన్‌...!

మాఫియా టార్గెట్‌లో ఎన్టీఆర్ హీరోయిన్‌…!

ఇటీవ‌ల సినిమా ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌ల‌పై లైంగీక వేధింపుల ప‌ర్వాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా మీటు ఉద్య‌మం పుణ్య‌మా ? అని ఎంతోమంది తాము ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి చెపుత‌న్నారు. ఈ క్ర‌మంలోనే యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప‌క్క‌న ఊస‌ర‌వెల్లి సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర‌లో ప్రాధాన్యం ఉన్న రోల్లో న‌టించిన పాయ‌ల్‌ఘోష్ సైతం కొద్ది రోజుల క్రిత‌మే తాను బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ నుంచి లైంగీక వేధింపులు ఎదుర్కొన్న‌ట్టు చెప్పింది.

 

 

అనురాగ్‌ను క‌లిసిన‌ప్పుడు అత‌డు త‌న‌కు నీలి చిత్రాలు చూపించ‌డంతో పాటు లైంగీకంగా లొంగ‌దీసుకునే ప్ర‌య‌త్నాలు చేశాడ‌ని కూడా ఆమె ఆరోపించింది. పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా అనురాగ్‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని చెప్పిన ఆమె ఇటీవ‌ల తానంటే గిట్ట‌ని కొంద‌రు బాలీవుడ్ మాఫియాతో చేతులు కలిపార‌ని.. వారు త్వ‌ర‌లోనే త‌న‌ను హ‌త్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో పాటు రాష్ట్ర‌ప‌తికి లేఖ రాసింది.

 

ఇక మీడియాలో అనురాగ్‌కు మ‌ద్ద‌తుగా ఎక్కువ మంది బాలీవుడ్ ప్ర‌ముఖులు నిల‌వ‌డంతో పాటు పాయ‌ల్‌పై సోష‌ల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువ కావ‌డంతో దీంతో ఆమె ఆ ద‌ర్శ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకుని త‌న‌కు న్యాయం చేయాలంటూ రాష్ట్ర‌ప‌తికి రాసిన లేఖ‌లో పేర్కొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news