Moviesముగ్గురు ప్లాపు డైరెక్ట‌ర్లతో మెగాస్టార్ మూడు సినిమాలు..!

ముగ్గురు ప్లాపు డైరెక్ట‌ర్లతో మెగాస్టార్ మూడు సినిమాలు..!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న ఆచార్య సినిమా త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నాడు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో స్పీడ్ త‌గ్గింది కాని లేక‌పోతే ఈ పాటికే ఆచార్య కంప్లీట్ అయ్యి మ‌రో సినిమాను ఆయ‌న లైన్లో పెట్టేసేవారు. ఇక వ‌చ్చే యేడాది మాత్రం మెగాస్టార్ వ‌రుస పెట్టి సినిమాలు లైన్లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే లూసీఫ‌ర్‌, వేదాళం రీమేక్‌ల‌లో న‌టించేందుకు చిరు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

 

తాజాగా వెంకీమామ ఫేం బాబి ద‌ర్శక‌త్వంలో కూడా మ‌రో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడ‌ని తెలుస్తోంది. చిరు ఒప్పుకున్న మూడు సినిమాల‌లో లూసిఫర్ రీమేక్ కు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా.. వేదాళమ్ రీమేక్ ను మెహర్ రమేశ్ డైరెక్టర్ చేయనున్నాడు. ఇప్పుడు వీరిద్ద‌రు కూడా బిగ్ ప్లాపుల్లోనే ఉన్నారు. అస‌లు వినాయ‌క్‌, ర‌మేష్ ఇద్ద‌రూ కూడా డైరెక్ష‌న్ మ‌ర్చిపోయార‌న్న సెటైర్లు ప‌డుతున్నాయి.

 

 

ఇక బాబికి కూడా స‌రైన హిట్ లేదు. జై ల‌వ‌కుశ ఎన్టీఆర్ క్రేజ్‌తో ఆడింది. వెంకీ మామ కూడా యావ‌రేజ్‌గా ఆడేసింది. మ‌రి ఇప్పుడు ఈ ముగ్గురు ప్లాప్ డైరెక్ట‌ర్ల‌ను న‌మ్ముకుని చిరు వ‌రుస సినిమాలు చేస్తుండ‌డంతో అభిమానుల్లో సైతం ఎక్క‌డా లేని ఆందోళ‌న నెల‌కొంది. తాజాగా వినాయ‌క్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మెహ‌ర్‌, బాబి ఆయ‌న ఇంటికి వెళ్లి విష్ చేయ‌డంతో పాటు సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఈ ఫొటో నెట్లో వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news