Newsఐపీఎల్ 2020: ప‌ర‌మ చెత్త రికార్డు న‌మోదు చేసిన ఢిల్లీ

ఐపీఎల్ 2020: ప‌ర‌మ చెత్త రికార్డు న‌మోదు చేసిన ఢిల్లీ

ఐపీఎల్ 2020 ఇప్పటికే తొలి అంకం ముగిసింది. అన్ని జ‌ట్లు ఏడేసి మ్యాచ్‌లు ఆడాయి. ఇక‌పై ప్ర‌తి మ్యాచ్ అన్ని జ‌ట్ల‌కు కీల‌కంగానే ఉంటుంది. నాకౌట్ రేసులో ఉండాలంటే చావోరేవో అన్న‌ట్టుగానే పోరాడాలి. తాజాగా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓడిపోయింది. అయితే ఈ ఓట‌మితో ఢిల్లీ ప‌ర‌మ‌చెత్త రికార్డు న‌మోదు చేసింది. ఐపీఎల్లో 100 ఓట‌ములు న‌మోదు చేసిన జ‌ట్టుగా ఢిల్లీ రికార్డుల‌కు ఎక్కింది. వంద మ్యాచ్‌ల్లో ఓడిపోయిన రెండో జ‌ట్టు ఢిల్లీ.

 

ఇంత‌కు ముందు ఈ రికార్డు పంజాబ్ పేరు మీద ఉంది. 100 మ్యాచ్‌ల్లో ఓడిన తొలి జ‌ట్టు పంజాబ్ అయితే రెండో జ‌ట్టు ఢిల్లీ. ఇక అత్య‌ధిక మ్యాచ్‌లో ఓడిన జ‌ట్ల‌లో మూడో స్థానంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (95), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (88), ముంబయి ఇండియన్స్‌ (80), రాజస్థాన్‌ రాయల్స్‌ (74) ఉన్నాయి. ఇక తాజా విజ‌యం త‌ర్వా పాయింట్ల పట్టిక‌లో ముంబై ఇండియ‌న్స్ తొలి స్తానంలో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news