Newsబిగ్ బ్రేకింగ్‌: క‌రోనాతో వైఎస్సార్‌సీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ మృతి

బిగ్ బ్రేకింగ్‌: క‌రోనాతో వైఎస్సార్‌సీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ మృతి

క‌రోనా ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను వెంటాడుతోంది. తాజాగా ఓ వైసీపీ ఎంపీ క‌రోనాతో మృతి చెంద‌డం తీవ్ర విషాద‌మైంది. తిరుప‌తి వైసీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్‌కు కొద్ది రోజుల క్రితం క‌రోనా సోకింది. దీంతో ఆయ‌న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆరోగ్యం విష‌మించ‌డంతో ఈ రోజు సాయంత్రం మృతి చెందారు. ఇక వైసీపీ ఎంపీలు వంగా గీత‌, గొడ్డేటి మాధ‌వి కూడా క‌రోనా భారీన ప‌డ్డారు.

 

ఇక 1985లో బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 1994లో ఆయ‌న చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రిగా ప‌నిచేశారు. 2009లో ఆయ‌న గూడూరు నుంచి టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఆయ‌న‌కు సీటు ఇవ్వ‌లేదు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న వైఎస్సార్‌సీపీలో చేరారు. తిరుప‌తి ఎంపీగా ఘ‌న‌విజ‌యం సాధించారు. ఆయ‌న గూడూరులో నివాసం ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news