Newsఆరుగురి పెళ్లాడిన మ‌హిళ‌... షాక్‌లో పోలీసులు..!

ఆరుగురి పెళ్లాడిన మ‌హిళ‌… షాక్‌లో పోలీసులు..!

ఒక మ‌హిళ ఒక‌రిని కాదు ఇద్ద‌రిని కాదు మ‌హాభార‌తంలో ద్రౌప‌దినే మించిపోయేలా ఏకంగా ఆరుగురు భ‌ర్త‌ల‌ను పెళ్లి చేసుకుంది. అప్ప‌టికే ఐదుగురు భ‌ర్త‌ల‌ను పెళ్లి చేసుకున్న ఆమె ఆరో భ‌ర్త‌ను పెళ్లాడి త‌మ‌ను త‌న మాజీ భ‌ర్త‌లు చంపేస్తార‌ని పోలీసుల ముందుకు వెళ్లింది. ఆమె ఫిర్యాదు చూసిన పోలీసులు వివ‌రాలు తెలుసుకుని షాక్ అయ్యారు. క‌ర్నాట‌క రాష్ట్రంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. క‌ర్నాట‌క‌లోని చిక్‌మ‌గ్‌ళూరు జిల్లా కంబిన‌హ‌ల్లి గ్రామానికి చెందిన చంద్రుడు ( 22), ప్రియ ( 38) అనే మ‌హిళ ఇటీవ‌ల పెళ్లి చేసుకుని పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

ఇక ప్రియ పోలీసుల‌కు త‌న‌కు ఐదుగురు వ్య‌క్తుల‌తో ప్రాణ‌హానీ ఉంద‌ని చెప్పింది. దీంతో పోలీసులు వారి కుటుంబ స‌భ్యులా ? అని ప్ర‌శ్నించ‌గా ప్రియ నో చెప్పింది. తాను ఇంత‌కు ముందు ఐదుగురిని పెళ్లి చేసుకున్నాన‌ని.. ఆ భ‌ర్త‌ల‌తో త‌న‌కు విబేధాలు రావ‌డంతో వారిని వ‌దిలేశాన‌ని. తాను చంద్రుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాన‌ని చెప్పింది. చంద్రుడితోనే తాను ఉంటాన‌ని.. త‌న‌కు త‌న మాజీ భ‌ర్త‌లు అయిన ఐదుగురితో ప్రాణ‌హానీ ఉంద‌ని.. త‌మ‌కు ర‌క్ష‌ణ కావాల‌ని ఆమె ఫిర్యాదు చేసింది.

అయితే ఇద్ద‌రి మ‌ధ్య 16 ఏళ్లు తేడా ఉండ‌డంతో పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసినా చంద్రుడు కూడా త‌న‌కు ప్రియ లేక‌పోతే చ‌చ్చిపోతాన‌ని బెదిరించాడు. చివ‌ర‌కు పోలీసులు ఆ ఐదుగురు భ‌ర్త‌ల‌ను పిలిచి విచారించ‌గా… ప్రియ వారికి విడాకులు ఇవ్వ‌కుండానే పెళ్లిళ్లు చేసుకుంటూ పోయింద‌ని చెప్పారు. చివ‌ర‌కు పోలీసులు ప్రియ‌పై కేసు పెట్టేందుకు సిద్ధ‌మ‌వ్వ‌గా… ఆమె మాజీ భ‌ర్త‌లు సైతం ఆమె త‌మ‌ను మోసం చేసినా ఆమె అంటే మాకు ఇష్ట‌మ‌ని చెప్ప‌డంతో పోలీసులు వారి మాట‌లు చూసి షాక్ తిన్నారు. ఏదేమైనా ఈ విష‌యం ఇప్పుడు క‌ర్నాట‌క‌లో సంచ‌ల‌నంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news