Politicsహైద‌రాబాద్‌లో పెళ్ల‌యిన 20 రోజుల‌కే భ‌ర్త‌ను చంపేసిన భార్య‌.... రీజ‌న్ ఇదే..!

హైద‌రాబాద్‌లో పెళ్ల‌యిన 20 రోజుల‌కే భ‌ర్త‌ను చంపేసిన భార్య‌…. రీజ‌న్ ఇదే..!

హైద‌రాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్ల‌యిన 20 రోజుల‌కే ఓ భార్య త‌న భ‌ర్త‌ను రోక‌లిబండ‌తో కొట్టి చంపేసింది. ట‌ప్పాచ‌బుత్ర స్టేష‌న్ ప‌రిధిలో ముజాహీద్‌న‌గ‌ర్‌లోని జిర్రా ముజాహిద్‌న‌గ‌ర్లో శుక్ర‌వారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. తాళ్ల‌గ‌డ్డ కాలనీకి చెందిన సమ్రీన్‌(22)కు తల్లిదండ్రులు లేరు. ఆమె బాధ్యతలు చూస్తోన్న మేన‌మామ ఆమెను 20 రోజుల క్రిత‌మే అస్లాం(25)తో జరిపించారు. పెళ్లినాటి నుంచే అస్లాం రోజూ మద్యం తాగి భార్యతో గొడవపడేవాడు.

మ‌ద్యం తాగ‌వ‌ద్ద‌ని భార్య న‌మ్రీన్ ఎంత చెప్పినా అస్లాం విన‌కుండా ఆమెను విప‌రీతంగా టార్చ‌ర్ పెడుతున్నాడు. గురువారం రాత్రి కూడా మ‌ద్యం తాగి ఇంటికి వ‌చ్చిన అస్లాంతో భార్య స‌మ్రీన్ శుక్ర‌వారం ఉద‌యం గొడ‌వ పెట్టుకుంది. ఆగ్రహంతో సమ్రీన్‌ రోకలి బండతో అస్లాంపై దాడిచేయగా కుప్పకూలాడు. స్థానికులతో కలిసి అస్లాం తండ్రి బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించాడు. అక్క‌డే చికిత్స పొందుతూ అస్లాం మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news