Moviesఒకే గ‌దిలో డ్ర‌గ్స్ హీరోయిన్లు సంజ‌న, రాగిణి... సంజ‌న ఏం చేసిందంటే..!

ఒకే గ‌దిలో డ్ర‌గ్స్ హీరోయిన్లు సంజ‌న, రాగిణి… సంజ‌న ఏం చేసిందంటే..!

శాండ‌ల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ సంజన, రాగిణి ద్వివేదిల‌ను పోలీసులు ఒకే గ‌దిలో ఉంచార‌ట‌. అయితే వీరిద్ద‌రు ఒకే గ‌దిలో ఉన్నా ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్టు ఉండ‌డంతో పాటు అస్స‌లు మాట్లాడుకోలేద‌ట‌. ఇక డ్ర‌గ్స్ ఉదంతంలో అరెస్టు అయిన రాగిణి, సంజ‌న‌ల‌ను బెంగళూరులోని మహిళ సాంత్వన కేంద్రంలో ఉంచార‌ట‌. వీరిద్ద‌రు ఎవ‌రికి వారు మౌనంగానే ఉన్నార‌ట‌. అయితే రాత్రి పొద్దు పోయే వ‌ర‌కు సంజ‌న క‌న్నీళ్లు పెట్టుకుంటూనే ఉందంటున్నారు.

సంజ‌న ఓ లేడీ కానిస్టేబుల్‌తో మాట్లాడుతూ ఇదంతా నా క‌ర్మ అని క‌న్నీళ్లు పెట్టుకోవ‌డంతో పాటు ఆమె భోజ‌నం కూడా చేయ‌కుండానే ఖ‌ళీ క‌డుపుతో ఉంద‌ట‌. ఈ విషయంలో ఇంకా చాలా మంది పెద్ద వారు ఉన్నా కూడా తననే అరెస్ట్ చేశారని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింద‌ట‌. ఇక ఈ డ్ర‌గ్స్ ఉదంతంలో క‌న్న రాజ‌కీయ నాయ‌కుల‌కు కూడా సంబంధం ఉంద‌ని అంటున్నారు.,

ఇక విచార‌ణ అధికారులు సంజ‌న‌ను నేడు, రేపు కూడా విచారించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ విచార‌ణ‌లో సంజన ఏం సమాధానం చెప్పబోతుందా ? ఇంకా ఎవ‌రెవ‌రి పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయా ? అని అంద‌రూ ఆస‌క్తితో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news