Moviesఅక్కినేని కోడ‌లు స‌మంత ఎంట్రీ ఇస్తోన్న కొత్త బిజినెస్ ఇదే...!

అక్కినేని కోడ‌లు స‌మంత ఎంట్రీ ఇస్తోన్న కొత్త బిజినెస్ ఇదే…!

అక్కినేని ఫ్యామిలీ అంటేనే బిజినెస్ బాగా చేస్తార‌న్న పేరుంది. దివంగ‌త ఏఎన్నార్ అప్ప‌ట్లోనే అటు చెన్నై చుట్టుప‌క్క‌ల భారీగా భూములు కొన్నారు. త‌ర్వాత ఇండ‌స్ట్రీ హైద‌రాబాద్‌కు షిఫ్ట్ అయిన‌ప్పుడు కూడా నాగేశ్వ‌ర‌రావు హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల భారీగా భూములు కొన్నారు. వాటి విలువ ఇప్పుడు కోట్ల‌లోనే ఉంది. ఏఎన్నార్ ముందు చూపుతోనే వైజాగ్‌లో కూడా భారీగా భూములు కొన్నారు. త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు నాగార్జున రియ‌ల్ ఎస్టేట్‌లోకి ఎంట్రీ ఇచ్చి హైద‌రాబాద్‌, వైజాగ్ స‌మీపంలో కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డులు పెట్టారు.

ఇక టీవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి కూడా నాగార్జున పెట్టుబ‌డులు పెట్టారు. ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఉన్న హీరోల‌లో తిరుగులేని బిజినెస్‌మేన్ ఎవ‌రంటే నాగార్జునే అన్న పేరు వ‌చ్చింది. ఇక ఆయ‌న రెండో త‌న‌యుడు అఖిల్ కూడా హార్స్ రేసుల‌తో పాటు బెంగ‌ళూరు రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డులు పెట్టిన‌ట్టు టాక్‌. ఇక ఇప్పుడు ఈ కుటుంబంలోకి కోడ‌లిగా వ‌చ్చిన స్టార్ హీరోయిన్ స‌మంత సైతం బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

త‌న సోష‌ల్ మీడియాలో ఆమె ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. సాకీ వ‌ర‌ల్డ్ పేరుతో ఆమె బ‌ట్ట‌ల వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తోంది. గ‌త కొంత కాలంగా తాను ఈ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాన‌ని కూడా సామ్ చెప్పింది. ఇక ప్ర‌తి ఒక్క‌రికి సామ్ వ‌రల్డ్ న‌చ్చుతుంద‌ని ఆమె చెప్పింది. ఇక ఆమె సినిమాల్లోకి రాక‌ముందు మోడ‌ల్‌గా ప‌నిచేసింది. అందుకే ఆమెకు ఈ రంగంపై మంచి గ్రిప్ ఉంది. మ‌రి సామ్ కొత్త వ్యాపారం ఎలా ఉంటుందో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news